News March 9, 2025
జగిత్యాల జిల్లాలో మండిన ఎండలు

జగిత్యాల జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శనివారం వెల్గటూర్లో 39.6℃ నమోదవ్వగా, మారేడుపల్లి 39.4, మెడిపల్లి, పెగడపల్లి 39.3, ఐలాపూర్ 38.9, సిరికొండ 38.8, గొల్లపల్లి, రాయికల్ 38.5, మెట్పల్లి 38.4, అల్లీపూర్ 38.3, సారంగాపూర్ 38.2, కథలాపూర్, గోదూరు 38.1, జగిత్యాల, నేరెళ్ల, రాఘవపేట 38, కోరుట్ల, మన్నెగూడెం 37.7, గుల్లకోట 37.5, జగ్గసాగర్, పొలాస 37.2, మల్లాపూర్, బుద్దేష్పల్లిలో 37.1℃గా నమోదైంది.
Similar News
News September 19, 2025
BREAKING: జూనియర్ ఎన్టీఆర్కు గాయం

సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డారు. హైదరాబాద్లో జరిగిన ఓ యాడ్ షూటింగ్లో తారక్ స్వల్పంగా గాయపడ్డట్లు ఆయన టీమ్ తెలిపింది. రెండు వారాల పాటు ఆయన విశ్రాంతి తీసుకుంటారని చెప్పింది. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.
News September 19, 2025
కవితపై దాడి చేయాలని చూస్తున్నారు: రేవంత్

TG: CM రేవంత్ మీడియాతో చిట్చాట్లో పలు అంశాలపై మాట్లాడారు. ‘నేను కవితకు సపోర్ట్ చేయడం లేదు. ఆమె కాంగ్రెస్లోకి వస్తానంటే ఒప్పుకోను. KCR, KTR, హరీశ్రావు కలిసి ఆడపిల్లపై దాడి చేయాలని చూస్తున్నారు. ఇది వారి ఇంటి సమస్య. వారిని ప్రజలు బహిష్కరించారు. కాళేశ్వరం విచారణ బాధ్యతను CBIకి అప్పగించి చాలా రోజులైనా కిషన్రెడ్డి ఎందుకు మాట్లాడట్లేదు? KTR ఏం చెప్తే కిషన్రెడ్డి అది చేస్తారు’ అని వ్యాఖ్యానించారు.
News September 19, 2025
అంకిత భావ సేవలతో పని చేయాలి: కలెక్టర్

రెవెన్యూ అధికారులు నిబద్ధత అంకిత భావ సేవలతో పని చేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం అమలాపురం కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో రెవెన్యూ అధికారులకు కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. జీవో నంబర్ 55 ప్రకారం దసరా సందర్భంగా మండపాలు రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. ఎటువంటి వివాదాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.