News March 11, 2025

జగిత్యాల జిల్లాలో వరుసగా ఏసీబీ దాడులు!

image

జగిత్యాల జిల్లాలో వరుస ఏసీబీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. మార్చి 5న కోరుట్ల పోలీస్ స్టేషన్లో ఎస్ఐ-3గా విధులు నిర్వహిస్తున్న శంకరయ్య ఏసిబికి చిక్కాడు. ధర్మపురి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ లంచం తీసుకుంటూ మార్చి 6న ఏసీబీకి పట్టుబడ్డాడు. తీవ్రవిమర్శలు ఎదుర్కొంటున్న కోరుట్ల మున్సిపల్ కమిషనర్ తిరుపతిని మార్చి6న జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సస్పెండ్ చేశారు. ఈ పరిణామాలన్నీ జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి.

Similar News

News March 26, 2025

బాలీవుడ్‌లో సెటిల్ అవుతారా? శ్రీలీల సమాధానమిదే

image

తాను బాలీవుడ్‌లో సెటిల్ అవుతానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని హీరోయిన్ శ్రీలీల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. టాలీవుడ్ తనకు ఇల్లు లాంటిదని పేర్కొన్నారు. మెడిసిన్ ఫైనలియర్ చదివేందుకు కొన్ని సినిమాలు వదులుకున్నట్లు వెల్లడించారు. నితిన్‌తో కలిసి ఆమె నటించిన ‘రాబిన్‌హుడ్’ ఎల్లుండి రిలీజ్ రానుంది. కాగా బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల డేటింగ్ చేస్తున్నట్లు ఇటీవల ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

News March 26, 2025

సిరిసిల్ల: ఏప్రిల్ 11లోపు ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముంపు గ్రామాల బాధితులు ఏప్రిల్ 11 లోపు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. జిల్లాలోని అన్నపూర్ణ, శ్రీ రాజరాజేశ్వర జలాశయం కింద ముంపునకు గురైన బాధితులు అప్లయ్ చేసుకోవాలని సూచించారు. మార్చి 26 నుంచి ఏప్రిల్ 11 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.

News March 26, 2025

MDK: జిల్లాకు మంత్రి పదవి దక్కేనా.!

image

ఎన్నో నెలలుగా ఊరిస్తున్న మంత్రివర్గ విస్తరణ ఉగాదిలోపు చేపట్టాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. క్యాబినెట్ విస్తరణపై ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ఖర్గేతో సీఎం రేవంత్ సుదీర్ఘంగా చర్చించారు. మంత్రి వర్గంలోకి 4 లేక ఐదుగురిని తీసుకునే అవకాశం ఉంది. ఇందులో ఉమ్మడి MDK జిల్లా నాయకురాలు, ఎమ్మెల్సీ విజయశాంతికి మంత్రి పదవిని ఇవ్వాలని అధిష్టానం భావిస్తోన్నట్లు సమాచారం. మరి మీ కామెంట్..

error: Content is protected !!