News April 2, 2025

జగిత్యాల జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ

image

జగిత్యాల జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఏప్రిల్ 1 నుంచి 30 వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ తెలిపారు. ఈ సమయంలో పోలీసు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. అలాగే, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే విధంగా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని ప్రజలకు సూచించారు.

Similar News

News April 8, 2025

IPLలో ఫాస్టెస్ట్ సెంచరీలు (బంతుల్లో)

image

30 – క్రిస్ గేల్ (RCB) vs PWI, బెంగళూరు, 2013
37 – యూసుఫ్ పఠాన్ (RR) vs MI, ముంబై, 2010
38 – డేవిడ్ మిల్లర్ (KXIP) vs RCB, మొహాలీ, 2013
39 – ట్రావిస్ హెడ్ (SRH) vs RCB, బెంగళూరు, 2024
39 – ప్రియాంశ్ ఆర్య (అన్‌క్యాప్డ్ ప్లేయర్) (PBKS) vs CSK, ముల్లన్‌పూర్, 2025*

☞ ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత ఆటగాళ్లలో ప్రియాంశ్ రెండో స్థానంలో నిలిచారు. తొలి స్థానంలో యూసుఫ్ పఠాన్ ఉన్నారు.

News April 8, 2025

రైతు బజార్‌లో తగ్గింపు ధరలో బియ్యం, కందిపప్పు

image

విశాఖలో బియ్యం, కందిపప్పు ట్రేడర్స్, టోకు వ్యాపారాలతో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ మంగళవారం ధరలపై సమీక్ష చేశారు. బహిరంగ మార్కెట్లో వీటి ధర ఎక్కువగా ఉందని రైతు బజార్‌లో తక్కువ రేటుకే ఇవ్వనున్నట్లు తెలిపారు. విశాఖలో గాజువాక, ములగాడ, ఎంవీపీ, కంచరపాలెం, మధురవాడ, పెద్ద వాల్తేర్ రైతు బజార్లలో కందిపప్పు కేజీ రూ.104, రా రైస్ కేజీ రూ.44, స్టీమేడ్ రైస్ కేజీ రూ.45కు అమ్మనున్నట్లు తెలిపారు.

News April 8, 2025

ఏప్రిల్ 10 నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

image

AP: తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఏప్రిల్ 10 నుంచి 12 వరకు జరగనున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. సాలకట్ల వసంతోత్సవాలు ఏటా చైత్రశుద్ధ పౌర్ణమి రోజు ముగిసేటట్లుగా నిర్వహిస్తారు.

error: Content is protected !!