News January 26, 2025
జగిత్యాల : జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గణతంత్ర వేడుకలు

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో 76 గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎందరో త్యాగధనుల ఫలితమే ఈ గణతంత్ర దినోత్సవమని అన్నారు. మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత సమాజంలో ఏ విలువలకు కట్టుబడి ఉండాలి అనేది రాజ్యాంగంలో రూపొందించబడిందన్నారు. దీనికి కట్టుబడి ప్రతి ఒక్క చట్టం అమలు ఉంటుందన్నారు.
Similar News
News December 2, 2025
కాకినాడ: ‘చంపేసి పారిపోయాడు.. ఇతను కనిపిస్తే చెప్పండి’

కాకినాడ రూరల్ ఇంద్రపాలేనికి చెందిన బేతా గంగరాజు (52) తన భార్యను గత నెల 30న హత్య చేసి పరారయ్యాడని ఇంద్రపాలెం ఎస్ ఐ వీరబాబు తెలిపారు. అతని ఆచూకీ తెలిసినవారు పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఎస్ఐ ఫోన్ 9440796521, సీఐ 9440796555 కు సమాచారం ఇవ్వాలన్నారు.
News December 2, 2025
ADB: అసలు మీరు ఏ వర్గం రా బాబూ..!

పంచాయతీ ఎన్నికల వేళ పార్టీలోకి ఫిరాయింపులు, చేరికలు జోరందుకున్నాయి. పలువురు నాయకులు ఓవైపు అధికార పార్టీ నాయకులతో సంప్రదింపులు జరుపుతూ, మరోవైపు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నాయకులతో అంట కాగుతున్నారు. ఉదయం ఒక పార్టీ కండువా వేసుకుని.. సాయంత్రం మరో పార్టీలో చేరుతున్న ఘటనలు చేసుకుంటున్నాయి. ఇది చూసిన పలువురు మీరు ఏ వర్గం రా బాబు అంటూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. మీ ప్రాంతంలోనూ ఇలాగే జరుగుతోందా కామెంట్ చేయండి.
News December 2, 2025
HYD: సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అవినీతి స్లాట్స్

సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అవినీతి రోజురోజుకు పెరిగిపోతుంది. అవినీతిని అరికట్టేందుకు తెచ్చిన స్లాట్ బుకింగ్ను అక్రమార్కులు తమ దందాకు వాడుకుంటున్నారు. HYD పరిధిలోని 45 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇది సాగుతోంది. లాగిన్ ఐడీలను క్రియేట్ చేసి అవసరం లేకుండా స్లాట్ బుక్ చేస్తున్నారు. అత్యవసరంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి నుంచి ఎక్కువ డబ్బులు లాగుతూ రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు ప్రజలు తెలిపారు.


