News January 28, 2025

జగిత్యాల జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక

image

మిషన్ భగీరథ పైప్ లైన్ మరమ్మతుల దృష్ట్యా జగిత్యాల జిల్లాలో 5 రోజులు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు మిషన్ భగీరథ కార్యనిర్వహణధికారి శేఖర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 3 వరకు కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాల్లో (వెల్గటూర్, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కోరుట్ల మండలాలు మినహాయించి) ఉన్న గ్రామాలకు, మున్సిపాలిటీలకు మిషన్ భగీరథ నీరు అందదన్నారు.5 రోజులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.

Similar News

News November 9, 2025

డిసెంబర్ 15న IPL వేలం!

image

ఐపీఎల్ మినీ వేలం డిసెంబర్ 15న నిర్వహించే అవకాశం ఉందని TOI పేర్కొంది. గత రెండు వేలంపాటలను దుబాయ్, సౌదీ అరేబియాలో జరపగా ఈసారి ఇండియాలోనే నిర్వహించే ఛాన్స్ ఉందని తెలిపింది. కాగా రిటెన్షన్ డెడ్‌లైన్ ఈనెల 15న ముగియనుంది. ఈలోపు ఫ్రాంచైజీలు తాము అంటిపెట్టుకునే ప్లేయర్లను ప్రకటించాలి. అయితే CSK, RR జడేజా, శాంసన్‌ను ట్రేడ్ చేసుకోవచ్చని ప్రచారం జరుగుతోంది.

News November 9, 2025

లిల్లీ పూల సాగు – అనువైన రకాలు

image

☛ సెమి-డబుల్ రకాలు: వీటిలో పూల రేకులు 2-3 వరుసలలో అమరి ఉంటాయి. ఉదా: CV. సెమీ-డబుల్.
☛ డబుల్ లిల్లీ రకాలు: ఈ పూల రేకులు 3 కన్నా ఎక్కువ వరుసలలో అమరి ఉంటాయి.
☛ ఉదా: సువాసిని, స్వర్ణ రేఖ, హైదరాబాద్ డబుల్, కలకత్తా డబుల్, వైభవ్, పెర్ల్ డబుల్. ఈ రకాలను ఎక్కువగా బొకేల తయారీలో వాడతారు. ☛ రైతులు ఏ ఉద్దేశంతో వీటిని సాగు చేయాలనుకుంటున్నారో అందుకు అనువైన రకాన్ని వ్యవసాయ నిపుణుల సూచనలతో ఎన్నుకోవడం మంచిది.

News November 9, 2025

NZB: లాడ్జిలో వ్యభిచారం.. ఇద్దరి అరెస్ట్

image

లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు 1 టౌన్ SHO రఘుపతి తెలిపారు. నగరంలోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో లక్ష్మీ లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు శనివారం రాత్రి దాడి చేశారు. లాడ్జి నిర్వాహకులు సాయిలు, రాజును అరెస్టు చేశారు. మరో ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.