News January 28, 2025
జగిత్యాల జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక

మిషన్ భగీరథ పైప్ లైన్ మరమ్మతుల దృష్ట్యా జగిత్యాల జిల్లాలో 5 రోజులు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు మిషన్ భగీరథ కార్యనిర్వహణధికారి శేఖర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 3 వరకు కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాల్లో (వెల్గటూర్, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కోరుట్ల మండలాలు మినహాయించి) ఉన్న గ్రామాలకు, మున్సిపాలిటీలకు మిషన్ భగీరథ నీరు అందదన్నారు.5 రోజులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.
Similar News
News November 16, 2025
అది ఛేజ్ చేయగలిగే టార్గెటే: గంభీర్

టెస్టుల్లో ఆడాలంటే స్కిల్తో పాటు మెంటల్ టఫ్నెస్ ఉండాలని IND హెడ్ కోచ్ గంభీర్ అన్నారు. SAతో తొలి టెస్టులో <<18303459>>ఓటమి<<>> అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ‘124 ఛేజబుల్ టార్గెటే. పిచ్ ఆడేందుకు వీలుగానే ఉంది. ఇలాంటి పిచ్పై ఆడాలంటే టెక్నిక్, టెంపెరమెంట్ ఉండాలి. ఫాస్ట్ బౌలర్లకే ఎక్కువ వికెట్లు పడ్డాయి. మేం అడిగిన పిచ్నే క్యూరేటర్ తయారు చేశారు. బాగా ఆడనప్పుడు ఇలాగే జరుగుతుంది’ అని పేర్కొన్నారు.
News November 16, 2025
రేపు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్న కలెక్టర్

ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కలెక్టరేట్లో సోమవారం PGRSను నిర్వహించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఈ వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమం సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు.
News November 16, 2025
వరంగల్: వడ్డీ వ్యాపారుల గిరి గిరి తంతు..!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఫైనాన్స్ పేరుతో వడ్డీ వ్యాపారులు పేదలను తీవ్రంగా దోపిడీ చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అధిక వడ్డీలు విధించి చిన్న వ్యాపారుల నడ్డి విరుస్తున్నారు. కట్టలేకపోతే బెదిరింపులు, గొడవలు రోజువారీగా మారాయి. అనుమతులు లేకుండా రూ.కోట్ల లావాదేవీలు జరిపినా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు ఆర్థికంగా నలిగిపోతున్నారు. కానీ నియంత్రణ వ్యవస్థ నిమ్మకునీరెత్తనట్టుగా వ్యవహరిస్తోంది.


