News April 8, 2025
జగిత్యాల: నామాపూర్ విద్యార్థులకు గోల్డ్ మెడల్

సైన్స్ ఒలంపియాడ్ ఫౌండేషన్ న్యూఢిల్లీ నిర్వహించిన పరీక్షలో పెగడపల్లి మండలం నామాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. అన్నాడు చైత్ర రెడ్డి, చెక్క బండి సుస్మిత, సాయి రాజా హంసిత, ఈగ అరుణ్ ఈ పోటీల్లో పాల్గొని జోనల్ స్థాయి ర్యాంకులు సాధించి బంగారు పథకాలు సాధించారు. పథకాలు సాధించిన విద్యార్థులను ఎంఈవో మాదాడి సులోచన, ఉపాధ్యాయులు అభినందించారు.
Similar News
News February 24, 2026
కూలెంట్ ఉన్నచోటే తేడా జరిగి ఉండొచ్చు: వీరపాండియన్

AP: పాలకల్తీ <<19216426>>ఘటనకు<<>> సంబంధించి రక్తనమూనాలు సేకరించడం సహా పలు పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్యశాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. పాలరుచిలో తేడా వచ్చిందని.. బాధితులకు తొలుత వాంతులు అయ్యాయని వివరించారు. ఒకే ప్రాంతం నుంచి రావడంతో వైద్యులకు అనుమానం వచ్చిందన్నారు. కూలెంట్ వద్దే ఏదైనా జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఆ ప్రాంతాల్లో మరో నెలపాటు పరిస్థితులు పర్యవేక్షిస్తామన్నారు.
News February 24, 2026
భూసేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్

జిల్లాలో జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల భూసేకరణను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విజయనగరం కలెక్టరేట్లో మంగళవారం జరిగిన సమీక్షలో తారకరామ తీర్థసాగర్, తోటపల్లి, జాతీయ రహదారులు, రైల్వే లైన్లు, తదితర పనుల పురోగతిని సమీక్షించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ రహదారి, కాలువలు, ఎస్టీపీలు, ఒబేరాయ్ హోటల్కు సంబంధించిన భూసేకరణను గడువులోగా పూర్తి చేయాలన్నారు.
News February 24, 2026
NRPT: SSC, ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

జిల్లాలో జరిగే పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. మంగళవారం నారాయణపేట కలెక్టరెట్లో ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పారు. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని చెప్పారు.


