News March 5, 2025

జగిత్యాల: నేడే పరీక్షలు.. ALL THE BEST

image

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 14,450 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారు. ఫస్టియర్ 7,073, సెకండియర్‌లో 7,377 మంది విద్యార్థులు రాయనుండగా.. 28 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇంటర్ పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో BNS 163(144) సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. ఒక నిమిషం ఆలస్యాన్ని తాజాగా 5 నిమిషాలకు సడలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ALL THE BEST

Similar News

News December 4, 2025

చంద్రబాబును బొక్కలో పెట్టాలి: జగన్

image

AP: చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజలను మోసం చేశారని జగన్ విమర్శించారు. ‘చంద్రబాబుపై చీటింగ్ కేసు పెట్టి బొక్కలో వేయాలి. ఎవరైనా ఇలాంటి మోసం చేస్తే ఏం చేసేవారు? జైల్లో పెడతారు కదా’ అని మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. తల్లికి వందనం, ఉచిత సిలిండర్లు అంటూ మోసం చేశారని.. ఉచిత బస్సుకు ఎన్నో నిబంధనలు పెట్టారని ఫైరయ్యారు. నాడు-నేడును పూర్తిగా ఆపేసి, ఇంగ్లిష్ మీడియాన్ని తీసేశారని విమర్శించారు.

News December 4, 2025

WGL: పెరిగిన వండర్ హట్, తగ్గిన తేజా మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్‌‌లో గురువారం ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. వండర్ హాట్(WH) మిర్చి క్వింటాకు బుధవారం రూ.19 వేలు ధర రాగా, ఈరోజు రూ.19,300 అయింది. 341 రకం మిర్చికి నిన్న రూ.16,500 ధర రాగా, నేడు కూడా అదే దర వచ్చింది. అలాగే తేజ మిర్చి బుధవారం రూ.14,200 పలకగా, ఈరోజు కూడా అదే ధర వచ్చింది. కొత్త తేజ మిర్చి నిన్న రూ.14,800 ధర వస్తే నేడు రూ.14,200కి పడిపోయింది.

News December 4, 2025

ASF: ఊపందుకున్న సోషల్ మీడియా ప్రచారం

image

ASF జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి సోషల్ మీడియాలో ఊపందుకుంది. అభ్యర్థులు అభివృద్ధి హామీలతో పోస్టులు షేర్ చేస్తూ, తమ మేనిఫెస్టోలతో నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. సమస్యల పరిష్కారం వంటి హామీలతో గ్రామాల్లో చర్చలు రగులుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచార వీడియోలు, పోస్టర్లను ఫేస్ బుక్, వాట్స్ అప్, ఇంస్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి. ఎవరి వర్గానికి వారు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు.