News February 27, 2025

జగిత్యాల: నేడే పోలింగ్.. అంతా రెడీ!

image

నేడు జరగనున్న KNR, MDK, ADB, NZB పట్టభద్రుల, టీచర్ MLC ఎన్నికల పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. పట్టభద్రులు 35,281, ఉఫాధ్యాయులు 1,769 మంది ఓటర్లు ఉన్నారు. పట్టభద్రుల కోసం 51, ఉపాధ్యాయుల కోసం 20 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టభద్రుల బరిలో 56 మంది, ఉపాధ్యాయ స్థానంలో 15 మంది ఉండగా.. ఎవరు విజేతగా నిలుస్తారో మార్చి 3వ తేదీ వరకు వేచి ఉండాల్సిందే.

Similar News

News October 31, 2025

విశాఖ: పట్టణ ప్రణాళిక అధికారులులతో మేయర్ సమీక్ష

image

GVMC పరిధిలో ఎన్ని ప్రకటనల హోర్డింగు బోర్డులు ఉన్నాయి వాటి పూర్తి వివరాలను నివేదించాలని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు GVMC పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. శుక్రవారం GVMC కార్యాలయంలో పట్టణ ప్రణాళిక అధికారులు, ప్రకటన హోర్డింగుల ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. పార్ట్నర్షిప్ సమ్మిట్‌కు ప్రకటన బోర్డులను ప్రదర్శించడానికి వాటికి ఎంత వసూలు చేస్తున్నారో వివరాలను అడిగి తెలుసుకున్నారు.

News October 31, 2025

రోడ్డు మరమ్మత్తుల్లో నాణ్యత పాటించాలి: కలెక్టర్

image

రోడ్ల మరమ్మతుల విషయంలో ఎలాంటి అలసత్యం లేకుండా వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అధికారులను ఆదేశించారు. ఇటీవల కురిసిన వర్షానికి సూర్యాపేట దంతాలపల్లి రోడ్లు గుంటలు ఏర్పడి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. కలెక్టర్ ఈరోజు పరిశీలించి ఆర్అండ్‌బి అధికారులను మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. నాణ్యతతో పాటు రహదారులు ఎక్కువ కాలం ఉండేలా నాణ్యత పనులను చేపట్టేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

News October 31, 2025

శ్రీకాకుళం: టుడే టాప్ హెడ్ లైన్స్

image

★ పల్లెల అభివృద్దే కూటమి లక్ష్యం: ఎమ్మెల్యే కూన
★సారవకోట: దొంగతనం కేసులో ఇద్దరు అరెస్ట్
★ పంట నష్టాన్ని పరిశీలించిన ఎమ్మెల్యేలు అశోక్, శంకర్
★ కోటబొమ్మాళిలో చెట్టుకు ఉరివేసుకుని ఒకరు సూసైడ్
★ లావేరులో అగ్నిప్రమాదం..మూడు పూరిళ్లు దగ్ధం
★ పాతపట్నం: రాళ్లు తేలిన ఆల్ ఆంధ్రా రోడ్డు
★ జిల్లాలో పలుచోట్ల పోలీసుల కొవ్వొత్తుల ర్యాలీలు