News February 21, 2025
జగిత్యాల: నేరం చేస్తే శిక్ష తప్పదు: ఎస్పీ

జిల్లాలోని గడిచిన రెండు నెలల్లో వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న 14 మందికి జైలు శిక్షలు పడే విధంగా కృషి చేసిన పీపీలను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అభినందించి ప్రశాంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతటి వారైనా నేరం చేస్తే శిక్ష తప్పదని అన్నారు. నేరస్థులకు శిక్ష పడేలా చేయడం ద్వారా సమాజంలో మంచి మార్పు తీసుకరావచ్చన్నారు.
Similar News
News December 14, 2025
15న నెల్లూరుకు ఢిల్లీ CM రాక

నెల్లూరు హరినాథపురంలో మాజీ ప్రధాని వాజ్పేయీ విగ్రహావిష్కరణ జరగనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు శీపారెడ్డి వంశీధర్ రెడ్డి తెలిపారు. ఈనెల 15న జరిగే ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఆరోజు అటల్ – మోదీ సుపరిపాలన యాత్ర జరగనున్నట్లు చెప్పారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా హాజరవుతారని తెలిపారు.
News December 14, 2025
భూపాలపల్లి జిల్లాలో పోలింగ్ శాతం ఎంతంటే?

జిల్లా ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటలకు భూపాలపల్లి మండలంలో 27.38%, చిట్యాలలో 27.04%, పలిమెలలో 28.40%, టేకుమట్లలో 23.88% పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని తెలిపారు. పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 1కి ముగియనుండడంతో, ఓటర్లు త్వరగా ఓటు వేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
News December 14, 2025
మెదక్: SUPER.. PHOTO OF THE DAY

ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండో దశ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. రామాయంపేట పరిధి నిజాంపేట మండలం కల్వకుంట గ్రామంలో ఓ తండ్రి అంగవైకల్యం కలిగిన తన కూతురిని పోలింగ్ కేంద్రం వద్దకు భుజాలపై మోసుకొచ్చి ఓటర్ చైతన్యాన్ని చాటుకున్నాడు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. ఈ ఫొటో ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది.
SHARE IT


