News February 15, 2025

జగిత్యాల: నోడల్ అధికారులకు కలెక్టర్ సూచనలు

image

ఎమ్మెల్సీ పోలింగ్ విధులపై నోడల్ అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ఎలాంటి సందేహాలు ఉన్నా, శిక్షణ తరగతుల్లో మాస్టర్ ట్రైనర్లను అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. ఈ నెల 26న ఉదయం 8 గంటలకు ప్రిసైడింగ్ అధికారులు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకోని పోలింగ్ సామగ్రి, బ్యాలెట్ బాక్స్‌లను క్షుణ్ణంగా పరిశీలించాలని, సంయమనంతో సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు.

Similar News

News April 19, 2026

రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు: జేసీ

image

ధాన్యం కొనుగోలులో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ తెలిపారు. శనివారం భీమడోలు మండలం సూరప్పగూడెం రైతు సేవా కేంద్రాన్ని పరిశీలించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గోనెసంచులు అందుబాటులో ఉంచినట్లు, తేమ శాతం, రవాణా విషయంలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. సమస్యలు ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు.

News April 19, 2026

రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు: జేసీ

image

ధాన్యం కొనుగోలులో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ తెలిపారు. శనివారం భీమడోలు మండలం సూరప్పగూడెం రైతు సేవా కేంద్రాన్ని పరిశీలించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గోనెసంచులు అందుబాటులో ఉంచినట్లు, తేమ శాతం, రవాణా విషయంలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. సమస్యలు ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు.

News April 19, 2026

నిజాంపట్నం: ‘చేపల వేట నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలి’

image

సముద్రంలో చేపల వేట నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలని మత్స్యశాఖ అదనపు డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. శనివారం నిజాంపట్నం హార్బర్‌లో వేట నిషేధ భృతికి సంబంధించి జరుగుతున్న ఎన్యుమరేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు వేట నిషేధం అమల్లో ఉంటుందని, ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేట నిషేధ భృతి అర్హులకు పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.