News March 11, 2025
జగిత్యాల: ‘పంటలు కాపాడేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలి’

పంటలు కాపాడేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. యాసంగి సాగు నీటి సరఫరాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, చీఫ్ సెక్రెటరీ శాంతి కుమారి తో కలిసి జిల్లా కలెక్టర్లతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. వీడియో కాన్ఫరెన్స్ లో జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్, అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, ఎస్పీ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 16, 2025
ADB: జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించాలని వినతి

తెలంగాణ ప్రభుత్వ సలహాదారు నరేందర్ రెడ్డిని మాజీ ఎంపీ రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలన్నారు. ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో ఉన్న నాగోబా ఆలయ అభివృద్ధిపై చర్చించినట్లు వెల్లడించారు.
News November 16, 2025
రాజ్యాంగం వల్లే చాయ్వాలా ప్రధాని అయ్యారు: CBN

AP: బీఆర్ అంబేడ్కర్ అద్భుతమైన రాజ్యాంగాన్ని మనకు అందించారని సీఎం చంద్రబాబు కొనియాడారు. ‘చాయ్వాలా మోదీ దేశానికి ప్రధాని కాగలిగారంటే రాజ్యాంగం వల్లే. మన రాజ్యాంగం అందించే స్ఫూర్తి చాలా గొప్పది. వ్యవస్థలోని లోపాలను సరిదిద్దుతూ న్యాయవ్యవస్థ కీలక బాధ్యత పోషిస్తోంది’ అని తెలిపారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైకోర్టు న్యాయవాదులు నిర్వహించిన కార్యక్రమంలో సీఎం, CJI పాల్గొన్నారు.
News November 16, 2025
వరంగల్ సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి: వెంకట్ నారాయణ

వరంగల్ మహా నగరాన్ని ఒకే జిల్లాగా ప్రకటించి ప్రాంత సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని ఉద్యమకారుల ఐక్యవేదిక ఛైర్మన్ వెంకటనారాయణ అన్నారు. ఆదివారం హనుమకొండలో ఆయన మాట్లాడుతూ.. మామునూరు ఎయిర్ పోర్టు, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, ఐటీ హబ్, జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను సమగ్ర అభివృద్ధి చేసేలా ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేయాలన్నారు. కార్యక్రమంలో రామమూర్తి, బాబురావు తదితరులు ఉన్నారు.


