News March 11, 2025
జగిత్యాల: ‘పంటలు కాపాడేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలి’

పంటలు కాపాడేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. యాసంగి సాగు నీటి సరఫరాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, చీఫ్ సెక్రెటరీ శాంతి కుమారి తో కలిసి జిల్లా కలెక్టర్లతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. వీడియో కాన్ఫరెన్స్ లో జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్, అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, ఎస్పీ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News July 11, 2025
త్వరలోనే TDP ఉనికి గల్లంతు: పెద్దిరెడ్డి

వచ్చే ఎన్నికల్లో YCP విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని MLA పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఆయన ఎర్రాతివారిపల్లెలో ‘బాబు షూరిటీ-మోసం గ్యారెంటీ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన జీవితంలో మామిడిని రూ.2కే కొనడం ఎప్పుడూ చూడలేదన్నారు. కర్ణాటక కిలో మామిడిని రూ.16 మద్దతు ధరతో భారీగా అమ్ముతుంటే మన పాలకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. త్వరలో TDP ఉనికి గల్లంతవ్వడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.
News July 11, 2025
ములుగు జిల్లా జనసాంద్రత 71

ములుగు జిల్లా మొత్తం 3881 చ.కి.మి విస్తీర్ణం కలిగి ఉండగా 2,94,671 జనాభా ఉంది. వీరిలో పురుషులు 1,46,205, మహిళలు 1,48,466 ఉండగా జిల్లాలో జనసాంద్రత 71గా ఉంది. అయితే ఉమ్మడి కుటుంబంతోనే సంతోషంగా ఉండొచ్చని పలువురు అంటున్నారు. మారుతున్న కాలనీకి అనుగుణంగా పేరెంట్స్ ప్రస్తుతం ఒక్కరు లేదా ఇద్దరు పిల్లలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. జనాభా పెరుగుదలతో అనేక సమస్యలు వస్తాయంటున్నారు. నేడు ప్రపంచ జనాభా దినోత్సవం.
News July 11, 2025
కరీంనగర్: ‘రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయండి’

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జులై 12, 13 తేదీల్లో జరిగే రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతుల పోస్టర్ను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి ఎస్. అనిల్ మాట్లాడుతూ.. తరగతుల్లో విద్యార్థి సమస్యలు, జాతీయవాదం, దేశభక్తి తదితర అంశాలపై చర్చ జరుగుతుందని తెలిపారు. ప్రారంభ ఉపన్యాసాన్ని గుమ్మడి నరసయ్య ఇవ్వనున్నారు.