News March 20, 2025

జగిత్యాల: పదవ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం: డీఈఓ

image

జగిత్యాల జిల్లాలో పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సిద్ధంచేసినట్లు జిల్లా విద్యాధికారి రాము తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 67 పరీక్ష కేంద్రాల్లో 11,855 మంది రెగ్యులర్ విద్యార్థులు, 285 మంది బ్యాక్లాగ్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని ఆయన అన్నారు. 826 ఇన్విజిలేటర్ల ఆధ్వర్యంలో పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

Similar News

News November 22, 2025

తొలి టెస్టులో ఆసీస్ ఘన విజయం

image

ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగిన యాషెస్ తొలి టెస్టు రెండు రోజుల్లోనే ముగిసింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 205 రన్స్ టార్గెట్‌ను ఆసీస్ 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ENG బౌలర్లను ఓపెనర్ హెడ్ ఊచకోత కోశారు. కేవలం 83 బంతుల్లోనే 123 రన్స్ బాదారు. లబుషేన్ 51* రన్స్‌తో రాణించారు.
స్కోర్స్: ENG- 172, 164.. AUS- 132, 205/2

News November 22, 2025

iBOMMA రవిని పోలీస్ శాఖలో నియమించుకోవాలి:CVL

image

iBOMMA రవిని అందరూ రాబిన్‌హుడ్‌లా చూస్తున్నారని సీనియర్ అడ్వొకేట్, నటుడు CVL నరసింహారావు చెప్పారు. ప్రజలు ఇబ్బందులు పడితే సినిమాల్లో ఒకరు పుట్టుకొస్తాడని, అదే తీరులో రవి వచ్చాడని తెలిపారు. నిర్మాతలు తప్ప అతనిపై సామాన్యులెవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. ఎంతో నాలెడ్జ్ ఉన్న రవిని శిక్షించడం కంటే పోలీస్ శాఖలో సైబర్ నేరాల నియంత్రణకు ఉపయోగించుకోవాలని ప్రభుత్వానికి, పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

News November 22, 2025

మావోయిస్ట్ పార్టీకి మరో ఎదురుదెబ్బ

image

TG: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 37 మంది మావోలు లొంగిపోగా, వారిలో 25 మంది మహిళా కామ్రేడ్లు ఉన్నారు. వీరిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు సాంబయ్య, నారాయణ, ఎర్రాలు ఉన్నట్లు డీజీపీ తెలిపారు. లొంగిపోయిన వారిపై ఉన్న రూ.1.41కోట్ల రివార్డును వారికే అందిస్తాం అని చెప్పారు. ఈ సందర్భంగా మావోల నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.