News March 21, 2025
జగిత్యాల: పసుపు ధరలతో రైతన్నల్లో నిరాశ!

జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో పసుపు ధరలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. గురువారం పసుపు గోళ గరిష్ఠ ధర క్వింటాకు రూ.8,525, కనిష్ఠ ధర రూ. 5,000, పసుపు కాడి గరిష్ఠ ధర రూ. 9,800, కనిష్ఠ ధర రూ.6,350లుగా పలికాయి. చూర రకం పసుపు ఇంకా మార్కెట్కు రావడం లేదు. అయితే గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ధరలు చాలా తక్కువేనని రైతులు చెబుతున్నారు. ఊహించిన ధరలు రాకపోవడంతో నిరాశతో ఉన్నారు.
Similar News
News November 21, 2025
ఇలాంటి చెరకు తోటల్లో కోతలను ఆలస్యం చేయొద్దు

పురుగులు, తెగుళ్లు, నీటి ముంపు, నీటి ఎద్దడికి గురైన చెరకు తోటలను త్వరగా నరికి ఫ్యాక్టరీకి తరలించాలి లేదా బెల్లం తయారీకి వాడాలి. ఆలస్యం చేస్తే దిగుబడి, రస నాణ్యత తగ్గుతుంది. పూత పూసిన తోటలను ఆలస్యంగా నరికితే రస నాణ్యత తగ్గి, ఈ గడల చిగురు భాగంలో బెండు ఏర్పడి బరువు తగ్గుతుంది. కింద సగభాగం కణుపుల వరకు వేర్లు ఉండే చెరకు గడ రసంలో పంచదార శాతం గణనీయంగా తగ్గిపోతుంది. అందుకే ఈ గడలను ముందే నరికి తరలించాలి.
News November 21, 2025
ALERT.. ప్రమాదంలో ఉమ్మడి ఆదిలాబాద్

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాయు నాణ్యత క్రమంగా క్షీణిస్తోంది. కాలుష్యం సూచీ(AQI) నివేదిక ప్రకారం గురువారం ADBలో 131, ASFలో 125, NRMLలో 125, MNCLలో 123గా వాయు నాణ్యత నమోదైంది. సూచీల ప్రకారం.. వాయు నాణ్యత 0-50 (Green)ఉంటే ఎలాంటి ప్రమాదం లేదు. 51-100 (Yellow) శ్వాసకోశ వ్యాధి లక్షణాలు చూపవచ్చు. 101-150 (Orange) ఉంటే తీవ్ర అనారోగ్య సమస్యలు రావచ్చు. 151-200 (Red) ప్రమాదకరం. జాగ్రత్తగా ఉందాం.
SHARE IT
News November 21, 2025
కొత్తవలస MRO అప్పలరాజు సస్పెండ్

కొత్తవలస MRO పి.అప్పలరాజును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తవలస మండలంలోని చిన్నపాలెం, కింతలపాలెం, కొత్తవలస గ్రామాల్లో భూములకు సంబందించి మ్యుటేషన్లు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయంటూ PGRS ద్వారా కలెక్టర్కు స్థానికులు ఫిర్యాదు చేయడంతో చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం అక్కడ డిప్యూటీ తహశీల్దార్గా ఉన్న సునీతకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు.


