News January 29, 2025
జగిత్యాల: పెండింగ్ పనులను పూర్తి చేయాలి: కలెక్టర్

వసతి గృహాల్లో పెండింగ్ పనులను పూర్తి చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో మంగళవారం ఎస్సీ, ఎస్టీ మైనార్టీ శాఖపై సమీక్ష నిర్వహించారు.ఇందులో భాగంగా వసతిగృహాల్లో మరమ్మతుల కోసం కేటాయించిన నిధులను ఏ మేరకు వినియోగించారని శాఖల వారీగా సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్యం, మెనూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అడిషనల్ గౌతమ్ రెడ్డి తదితరులున్నారు.
Similar News
News February 19, 2025
టీమ్ ఇండియా ఆ పాక్ ఆటగాడితో జాగ్రత్తగా ఉండాలి: హర్భజన్

పాక్ ఆటగాడు ఫకర్ జమాన్తో టీమ్ ఇండియా జాగ్రత్తగా ఉండాలని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ హెచ్చరించారు. ‘భారత్పై జమాన్ రికార్డు చాలా బాగుంది. గతంలో మన విజయావకాశాల్ని అతడు దెబ్బకొట్టాడు’ అని గుర్తుచేశారు. భారత్పై 6 మ్యాచులాడిన జమాన్ 46.80 సగటుతో 234 రన్స్ చేయడం గమనార్హం. ఛాంపియన్స్ ట్రోఫీలో దాయాదుల సమరం ఈ నెల 23న జరగనుంది.
News February 19, 2025
తిరుపతి జిల్లాలో రిపోర్టర్లు కావలెను

తిరుపతి జిల్లా పరిధిలో పనిచేయడానికి Way2News రిపోర్టర్లను ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వాళ్లు మాత్రమే అర్హులు. ప్రస్తుతం ఇతర సంస్థల్లో పనిచేస్తున్న వాళ్లు సైతం మాకు వార్తలు రాయడానికి అర్హులు అవుతారు. ఆసక్తి ఉన్నవారు ఈ <
News February 19, 2025
కులంలోనే కాదు.. మతంలోనూ పేదరికం ఉంది: షబ్బీర్ అలీ

TG: మైనారిటీలను BCల్లో కలిపారంటూ BJP చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. ‘వెనుకబడిన మైనార్టీలు ఇప్పటికీ BC జాబితాలో ఉన్నారు. కులంలోనే కాదు మతంలోనూ పేదరికం ఉంది. పిలిస్తే బీజేపీ ఆఫీస్కు వచ్చి ప్రజెంటేషన్ ఇస్తా. వెనుకబడిన తరగతులు ఎక్కడ ఉన్నా వెనుకబడిన తరగతులే. బీసీలపై BJPకి అంత ప్రేమ ఉంటే బీసీ కులగణన చేయించాలి’ అని డిమాండ్ చేశారు.