News March 17, 2025
జగిత్యాల: పొలంలో మంచెలు.. అవే రక్షణ కంచెలు..!

పొలంలో మంచెలు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది పల్లెటూర్లు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు గుట్టల ప్రాంతాల్లో అడవి జంతువుల దాడి నుంచి తమను తాము రక్షించుకోవడానికి, పక్షులు, జంతువుల బారి నుంచి పంటను కాపాడుకోవడానికి ఇలాంటి మంచెలు నిర్మించుకుంటారు. పట్టణంలోని ఏసీ రూములను తలపించే ఇలాంటి మంచెల్లో సేద తీరితే వచ్చే ఆనందమే వేరని పల్లెటూరి వాసులు, ప్రకృతి ప్రేమికులు అంటుంటారు.
Similar News
News October 27, 2025
ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్.. యథావిధిగా పాఠశాలలు

ప్రభుత్వ ఆదేశాలను కొన్ని విద్యా సంస్థలు పాటించడం లేదని పలువురు అంటున్నారు. తుపాన్ ప్రభావంతో బాపట్ల జిల్లాలో 3 రోజులపాటు కలెక్టర్ పాఠశాలలు సెలవు ప్రకటించినప్పటికీ సూర్యలంక కేంద్రీయ విద్యాలయం మాత్రం సెలవు ప్రకటించలేదని అంటున్నారు. పాఠశాలను నిర్వహిస్తుండటంతో సోమవారం విద్యార్థులు యథాతధంగా పాఠశాలకు వెళ్తున్నారు. విద్యాశాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
News October 27, 2025
తిరుపతికి రూ.కోటి.. చిత్తూరుకు రూ.50 లక్షలు విడుదల

మొంథా తుపాన్ను ఎదుర్కునేందుకు చిత్తూరు, తిరుపతి జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. జిల్లాలో సహాయక చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తిరుపతి జిల్లాకు రూ.కోటి, చిత్తూరు జిల్లాకు రూ.50 లక్షల నిధులు విడుదల చేసింది. తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
News October 27, 2025
NGKL: వర్షాలకు నల్లబారుతున్న పత్తి.. దిగుబడి తగ్గే ప్రమాదం

నాగర్కర్నూల్ జిల్లాలో 20 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తెల్ల బంగారం అని పిలిచే పత్తి నల్లబారుతోంది. కోతకు వచ్చిన పంట పొలాల్లోనే తడిసి ముద్దవడంతో, పత్తి తీయడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లా వ్యాప్తంగా 2.65 లక్షల ఎకరాలలో పత్తి సాగు అయిందని అధికారులు అంచనా వేశారు. ఈ వర్షాల కారణంగా జిల్లాలో పత్తి దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.


