News February 1, 2025

జగిత్యాల: పోలీస్ అధికారులకు ఫైరింగ్ రేంజ్ ప్రాక్టీస్

image

పోలీస్ అధికారులకు, సిబ్బందికి వార్షిక శిక్షణలో భాగంగా జిల్లా ఎస్‌పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఫైరింగ్‌పై శిక్షణ ఇచ్చి ఫైరింగ్ రేంజ్ ప్రాక్టీస్ చేయించారు. ఈ సందర్భంగా ఎస్‌పీ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు, సిబ్బంది అధునాతన టెక్నాలజీని వాడుతూ, అన్నిరకాల ఆయుధాల పరిజ్ఞానం కలిగి ఉండాలన్నారు. సిబ్బంది వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు శిక్షణలు ఉపయోగపడుతాయాన్నారు.

Similar News

News February 15, 2025

GOOD NEWS: పప్పుల రేట్లు తగ్గాయ్

image

TG: భారీగా పెరిగిన పప్పుల ధరలు దిగొస్తున్నాయి. గతేడాది రూ.200-240 వరకు వెళ్లిన క్వాలిటీ కేజీ కందిపప్పు ప్రస్తుతం రూ.150-160కి వచ్చింది. క్వాలిటీ తక్కువుండే పప్పు రూ.110-125 పలుకుతోంది. శనగ పప్పు రూ.150 నుంచి రూ.135కు, మినప పప్పు రూ.160 నుంచి రూ.150కి, మైసూర్ పప్పు రూ.130 నుంచి రూ.115కి తగ్గింది. రాష్ట్రంలో పప్పుధాన్యాల సాగు, మార్కెట్లకు సరఫరా పెరగడమే ధరల తగ్గుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు.

News February 15, 2025

విశాఖ: కామాంధుడి కోరికలకు వివాహిత బలి

image

గోపాలపట్నంలో శుక్రవారం జరిగిన వివాహిత ఆత్మహత్య ఘటన కలిచివేసింది. తన వికృత చేష్టలతో భార్యను దారుణంగా హింసించిన భర్త.. చివరకు ఆమె ఆత్మహత్యకు కారణమయ్యాడు. పోర్న్ వీడియోలకు బానిసై భార్యతో మానవ మృగంలా ప్రవర్తించాడు. లైంగిక వాంఛకు ప్రేరేపించే మాత్రలు వేసుకోవాలని ఒత్తిడి చేసేవాడు. మానసికంగా ఎంతో వేదనను అనుభవించిన ఆమె చివరకు ఉరి వేసుకుని తన జీవితానికి ముగింపు పలికింది.

News February 15, 2025

రాజమండ్రి: జిల్లాలో దడ పుట్టిస్తున్న ‘జీబీఎస్’

image

గులియన్ బారే సిండ్రోమ్ ఉమ్మడి గోదావరి జిల్లాలను తాకింది. ఇప్పటివరకు కాకినాడ GGHలో 16 కేసులు, రాజమండ్రి GGHలో ఓ కేసు నమోదైంది. ప.గోకు చెందిన వ్యక్తి ప్రస్తుతం కాకినాడలో చికిత్స పొందుతున్నారు. అయితే భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. కాళ్లు, చేతులు తిమ్మిర్లు, కండరాల నొప్పులు ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలంటున్నారు. వ్యాధి ముదిరిన దశలో అవయవాలు చచ్చుబడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

error: Content is protected !!