News March 14, 2025
జగిత్యాల: పోలీస్ స్టేషన్ ఎదుట యువకుడి హంగామా

KNR జిల్లా రామడుగు మండల కేంద్రానికి చెందిన శివరాంకు JGTLకు చెందిన జమునతో మూడేళ్ల క్రితం వివాహమైంది. కొంత కాలానికి జమున శివరాంను వదిలిపోయింది. తన భార్య కాపురానికి రాకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో శివరాం మద్యం సేవించి, జిల్లా పోలీస్ స్టేషన్ ఎదుట మద్యం మత్తులో బీరు సీసాతో తన తలకు గాయం చేసుకున్నాడు. ఈ ఘటనలో గాయపడిన శివరాంను పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News March 17, 2026
గద్వాల: రైలు ఆలస్యం.. ముగ్గురు విద్యార్థుల జీవితాల్లో విషాదం

గద్వాల రైల్వే స్టేషన్ సమీపంలో <<19404491>>ఆర్టీసీ బస్సు, బైక్ను ఢీకొన్న ఘటన<<>>లో ముగ్గురు విద్యార్థులు ప్రమాదానికి గురయ్యారు. అయిజకు చెందిన రాము(17) అక్కడికక్కడే మృతి చెందాడు. మిట్టదొడ్డికి చెందిన విష్ణు, గంజిపేటకి చెందిన వర్ధన్ తీవ్ర గాయాలు కావడంతో వీరిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ వెళ్లేందుకు రైలు టికెట్లు తీసుకున్న వీరు.. రైలు ఆలస్యంతో బైక్పై బయటికి రావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
News March 17, 2026
జగిత్యాల: పార్టీ మార్పుపై జీవన్ రెడ్డి నిర్ణయం.. సంజయ్ కామెంట్స్

జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ మీడియా చిట్చాట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి పార్టీని వీడాలని ఎవరూ కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. గతంలో ఎల్.రమణతో కలిసి పనిచేశానని, అలాగే జీవన్ రెడ్డితో కూడా కలిసి పని చేస్తానని తెలిపారు. ఎల్.రమణలాంటి నాయకులకు మంత్రి పదవి ఇవ్వాల్సిందని, అలాంటి నిర్ణయాల్లో జరిగిన తప్పిదాల వల్లనే BRS మళ్లీ అధికారంలోకి రాలేదని ఆయన వ్యాఖ్యానించారు.
News March 17, 2026
కరీంనగర్: కాలువలో గల్లంతైన ప్రభుత్వ ఉద్యోగి మృతి

కరీంనగర్(D) కొత్తపల్లి మండలం చింతకుంట వద్ద కాలువలో గల్లంతైన ప్రభుత్వ ఉద్యోగి రాచకొండ లచ్చయ్య (55) మృతదేహం లభ్యమైంది. సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో వెటర్నరీ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఆయన, ఆదివారం స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయారు. ఒడ్డున దుస్తులు, బైక్ గుర్తించిన పోలీసులు గాలింపు చేపట్టగా చింతకుంట శివారులో మృతదేహం దొరికింది. భార్య పద్మ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.


