News March 27, 2025
జగిత్యాల: పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తుల గడువు పెంపు

జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసి, మైనారిటీ విద్యార్థులు కాలేజీలలో ఆన్లైన్ స్కాలర్షిప్ దరఖాస్తు చేసుకోవడానికి గడువు పొడిగించినట్లు జిల్లా షెడ్యూలు కులాల అభివృద్ధి అధికారి రాజ్ కుమార్ తెలిపారు. దరఖాస్తు గడువు ను ఈనెల 31 నుండి మే 31 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
Similar News
News April 23, 2025
ఎన్టీఆర్: ప్రధాని పర్యటన రూట్ మ్యాప్ను పరిశీలించిన అధికారులు

మే 2న ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా సంబంధిత రూట్ మ్యాప్ను అధికారులు బుధవారం పరిశీలించారు. విజయవాడ పశ్చిమ బైపాస్కు అనుసంధానమై ఉన్న సీడ్ యాక్సిస్ రహదారుల జంక్షన్లను సీఆర్డీఏ అదనపు కమిషనర్ ప్రవీణ్ చంద్, ఇతర అధికారులు పరిశీలించారు. ఈ మేరకు అడిషనల్ ఎస్పీ రవికుమార్, NHAI ప్రాజెక్టు డైరక్టర్ పార్వతీశం,CRDA అధికారులతో కలసి ఆయా రహదారులను రూట్ మ్యాప్ నిమిత్తం పరిశీలించారు.
News April 23, 2025
‘థాంక్యూ పాకిస్థాన్, థాంక్యూ లష్కర్-ఇ-తోయిబా’ అని పోస్ట్.. అరెస్టు

J&Kలో ఉగ్రదాడి వేళ టెర్రరిస్టు ఆర్గనైజేషన్లకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఝార్ఖండ్ మిలత్ నగర్కు చెందిన మహమ్మద్ నౌషద్ ‘థాంక్యూ పాకిస్థాన్, థాంక్యూ లష్కర్-ఇ-తోయిబా’ అని పోస్ట్ చేశాడు. ఇది వైరల్ కావడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఇలా పోస్ట్ చేయడం వెనుక అతడి ఉద్దేశమేంటి? ఎలాంటి లింక్స్ ఉన్నాయనేది కనుక్కుంటామని పోలీసులు తెలిపారు.
News April 23, 2025
SKLM: గ్రామదేవతల సిరిమాను ఉత్సవంపై సమీక్ష

అన్ని శాఖల సమన్వయంతో శ్రీ గ్రామదేవతల సిరిమాను ఉత్సవం ఏర్పాట్లపై దృష్టి సారించాలని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర రావు అన్నారు. బుధవారం కలెక్టరెట్ మందిరంలో గ్రామదేవతల సిరిమాను ఉత్సవం ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. సమన్వయంతో విధులు నిర్వహించి పండగ ఒక మంచి వాతావరణంలో జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు.