News February 17, 2025

జగిత్యాల: ప్రమాదవశాత్తు నిప్పంటుకొని వృద్ధురాలు మృతి

image

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తక్కలపల్లి గ్రామానికి చెందిన గడ్డమీద గంగు(72) అనే వృద్ధురాలు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకోవడంతో తీవ్ర గాయాలయ్య మృతి చెందినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. గంగు శనివారం రాత్రి తన ఇంటిలో టీ తయారు చేస్తుండగా.. ప్రమాదవశాత్తు చీరకు నిప్పంటుకుంది. మంటలు చెలరేగడంతో తీవ్ర గాయాలయ్యాయి. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలు పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ నవీన్ చెప్పారు.

Similar News

News December 25, 2025

పూసపాటిరేగ: పెళ్లై మూడు నెలలు.. వివాహిత ఆత్మహత్య

image

పూసపాటిరేగ మండలంలో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పూసపాటిరేగ గ్రామానికి చెందిన పుష్పకి ఎరుకొండ గ్రామానికి చెందిన శివకి 3 నెలల క్రితం వివాహమైంది. వరకట్నం వేధింపులు తాళలేక పుష్ప ఆత్మహత్య చేసుకుందని.. మృతురాలు తల్లి రమ బుధవారం ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్‌ఐ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News December 25, 2025

అడ్డతీగల: అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. దంపతులు మృతి

image

అడ్డతీగల మండలం కొట్టంపాలెం సమీప జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి అవంతి బస్సు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చెరుకుంపాలెం సచివాలయ అగ్రికల్చర్ అసిస్టెంట్ కె.నవీన్ కుమార్, భార్య బేబీ కళ్యాణి అక్కడికక్కడే మృతి చెందారు. అడ్డతీగల మండలం వేటమామిడి గ్రామంలో జరిగిన క్రిస్టమస్ ప్రార్ధనకు వెళ్లి చెరుకుంపాలెం తిరిగి వస్తుండగా ఎదురుగా అడ్డతీగల వైపు వెళుతున్న బస్సు ఢీకొట్టింది. పోలీసులు విచారిస్తున్నారు.

News December 25, 2025

నేటితో ముగియనున్న సుపరిపాలన యాత్ర

image

AP: మాజీ PM వాజ్‌ పేయి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో చేపట్టిన అటల్-మోదీ సుపరిపాలన యాత్ర నేటితో ముగియనుంది. ఈ నెల 11న ధర్మవరంలో ప్రారంభమైన యాత్రను రాజధాని అమరావతిలో ముగించనున్నారు. ఈ సందర్భంగా అమరావతిలోని అటల్ స్మృతివనంలో 11amకు అటల్ కాంస్య విగ్రహాన్ని CM CBN ఆవిష్కరిస్తారు. BJP ముఖ్యనేతలు హాజరుకానున్నారు. స్మృతివనానికి N4, E4 రోడ్డు జంక్షన్‌లో 2.33ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది.