News February 22, 2025

జగిత్యాల : ప్రశాంతమైన వాతావరణంలో MLC ఎన్నికలు జరపాలి: ఎస్పీ

image

ఈ నెల 27 న జరుగనున్న ఉపాధ్యాయ, పట్టభద్రుల MLC ఎన్నికల నిర్వహణకు సంబంధించి భద్రత పరమైన ఏర్పాట్లు పూర్తిచేయాలని ఎస్పీ అశోక్ కుమార్ పోలీస్ అధికారులను ఆదేశించారు. దీనిలో భాగంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పటిష్ఠమైన ప్రణాళిక, ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహణపై పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు.ఎలక్షన్స్ ముందు రోజు, పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత రోజు తీసుకోవాల్సిన చర్యలపై అవగహన కల్పించారు.

Similar News

News January 5, 2026

నల్గొండలో జిల్లాలో బీసీ వర్సెస్ రెడ్డి

image

నల్గొండ జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ ఏర్పాటు వ్యవహారం పార్టీలో సెగలు పుట్టిస్తోంది. అధ్యక్షుడిగా పున్నా కైలాస్ నియామకం తర్వాత కమిటీ కూర్పుపై కసరత్తు మొదలవ్వగా.. పదవుల కోసం ఆశావాహులు భారీగా క్యూ కడుతున్నారు. ప్రధానంగా రెడ్డి, బీసీ వర్గాల మధ్య ఆధిపత్య పోరు ‘హస్తం’ రాజకీయాలను వేడెక్కిస్తోంది. సామాజిక సమీకరణల మధ్య సమతూకం పాటించడం అధిష్ఠానానికి కత్తిమీద సాములా మారింది.

News January 5, 2026

NTR: డీ-మార్ట్‌‌కి భార్యాభర్తలు.. భార్య అదృశ్యం

image

భార్య అదృశ్యంపై భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉండవల్లికి చెందిన భార్యాభర్తలు ఆదివారం విజయవాడ డీ-మార్ట్‌లో షాపింగ్‌‌కి వచ్చారు. భర్త షాపింగ్ చేస్తుండగా భార్య ఫోన్ మాట్లాడుతూ ఉంది. కాసేపటికి భార్య కిందకి వెళ్లి భర్తను రమ్మని ఫోన్ చేసింది. అయితే కిందకి వచ్చిన భర్తకి భార్య కనపడలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో భర్త సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 5, 2026

తూ.గో: సైకిల్‌పై స్కూల్‌కి వెళ్తుంటే.. మృత్యువు దూసుకొచ్చింది!

image

గొల్లప్రోలు మండలం చేబ్రోలులో రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన పెండెం చిన్న (15) సైకిల్‌పై పాఠశాలకు వెళ్తుండగా.. అతివేగంగా వచ్చిన బైక్ బలంగా ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. తీవ్ర గాయాలతో కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి విద్యార్థి మృతి చెందాడు. మృతుడి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. గొల్లప్రోలు ఎస్ఐ రామకృష్ణ సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.