News March 20, 2025
జగిత్యాల: ప్రేమ పేరుతో బాలికకు వేధింపులు.. పురుగు మందు తాగి ఆత్మహత్య

జగిత్యాల జిల్లాలో ఓ బాలికను ప్రేమ పేరుతో ఓ యువకుడు, బాలుడు వేధించగా ఆమె పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై రవికిరణ్ వివరాల ప్రకారం.. పెగడపల్లి మండలం రామభద్రునిపల్లికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన రాము అనే యువకుడు, రంగదామునిపల్లికి చెందిన మరో బాలుడు ప్రేమ పేరుతో వేధించారు. అది భరించలేక ఈనెల 15న బాలిక పురుగుల మందు తాగగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది.
Similar News
News October 27, 2025
HYD: ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య ఆ మార్గాల్లో పెంచాలని డిమాండ్

అంతర్రాష్ట్ర బస్సులు ప్రధానంగా హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-బెంగళూరు మార్గాల్లో ఎక్కువగా నడుస్తున్నాయి. అలాగే విశాఖపట్నం, ముంబై, పూణే మార్గాల్లో కూడా రాకపోకలు కొనసాగుతున్నాయి. ఎలక్ట్రిక్ బస్సుల వైపు అనేక మంది ప్రయాణికులు మొగ్గు చూపుతుండగా.. వాటి సంఖ్యను ఆయా మార్గాల్లో పెంచాలని ప్రయాణికుల నుంచి డిమాండ్ పెరుగుతోంది.
News October 27, 2025
కరీంనగర్: దారుణం.. ‘బాలికల బాత్రూంలో కెమెరాలు’

గంగాధర మండలం కురిక్యాల జడ్పీ హైస్కూల్లో కీచక అటెండర్ అరాచకాలు బయటపడ్డాయి. బాలికల మూత్రశాలలో గోప్యంగా కెమెరాలు అమర్చి వీడియోలు చిత్రీకరించినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అనుమానాస్పద పరికరాన్ని గుర్తించిన బాలికలు తల్లిదండ్రులకు తెలపడంతో వారు పాఠశాల వద్ద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.
News October 27, 2025
అన్నదాత సుఖీభవ.. ఆ రైతులకు గుడ్ న్యూస్

AP: వెబ్ల్యాండ్ రికార్డుల్లో ఆధార్ తప్పుల వల్ల ‘అన్నదాత సుఖీభవ’ పథకం 5.44L మంది రైతులకు ఆగిపోయింది. వీటిలో ప్రతి సవరణకు మీ సేవా కేంద్రాల్లో రూ.50 ఛార్జ్ ఉంది. అయితే పథకం ఆగిపోయిన అన్నదాతలంతా ఒకసారి ఉచితంగా సవరణ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందుకోసం మీసేవా ఛార్జీలు రూ.2.72 కోట్లను మాఫీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది.
* రోజూ రైతులకు సంబంధించిన సమాచారం కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.


