News March 20, 2025

జగిత్యాల: ప్రేమ పేరుతో బాలికకు వేధింపులు.. పురుగు మందు తాగి ఆత్మహత్య

image

జగిత్యాల జిల్లాలో ఓ బాలికను ప్రేమ పేరుతో ఓ యువకుడు, బాలుడు వేధించగా ఆమె పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై రవికిరణ్ వివరాల ప్రకారం.. పెగడపల్లి మండలం రామభద్రునిపల్లికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన రాము అనే యువకుడు, రంగదామునిపల్లికి చెందిన మరో బాలుడు ప్రేమ పేరుతో వేధించారు. అది భరించలేక ఈనెల 15న బాలిక పురుగుల మందు తాగగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది.

Similar News

News December 18, 2025

దావోస్‌కు సీఎం రేవంత్‌.. కోర్టు గ్రీన్ సిగ్నల్

image

TG: ప్రపంచ ఆర్థిక సదస్సు (WEF)లో పాల్గొనేందుకు CM రేవంత్ రెడ్డికి ACB కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనవరిలో స్విట్జర్లాండ్‌లో జరిగే WEFకు హాజరయ్యేందుకు అనుమతి కోరగా రూ.10 వేల పూచీకత్తుపై అనుమతించింది. మార్చి 3 లోపు పాస్‌పోర్టు తిరిగి అప్పగించాలని స్పష్టం చేసింది. 2015 ఓటుకు నోటు కేసులో బెయిల్ షరతుల ప్రకారం రేవంత్ పాస్‌పోర్టు కోర్టు అధీనంలో ఉంది. జనవరి 19-23 వరకు దావోస్‌లో CM పర్యటించనున్నారు.

News December 18, 2025

మహబూబాబాద్‌లో ఎక్కువ.. ములుగులో తక్కువ!

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3వ విడత పంచాయతీ ఎన్నికల్లో 88.52 శాతం పోలింగ్‌తో మహబూబాబాద్ ముందు వరుసలో ఉంది. జనగామ 88.48%, వరంగల్ 88.21%, హనుమకొండ 86.45%, భూపాలపల్లిలో 84.02%, ములుగులో 83.88% పోలింగ్ నమోదు అయ్యింది. 24 మండలాల్లో జరిగిన 3వ విడతలో 6.28 లక్షల ఓటర్లుండగా, వారిలో 5.75 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

News December 18, 2025

HYD: ‘హద్దు’లు దాటిన ‘విలీనం’

image

విస్తరణలో భాగంగా GHMC 300 డివిజన్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దీనిపై అభ్యర్థనలను నిన్నటి వరకు స్వీకరించింది. అయితే విభజించిన వార్డుల్లో తక్కువ, ఎక్కువ ఓటర్లు ఉన్నారంటూ, అసలు దేని ఆధారంగా ఈ ప్రక్రియ చేశారంటూ భగ్గుమన్నారు. స్వీకరణ గడువు నేటితో ముగియనుంది. 3 వేలకుపైగా అభ్యర్థనలు వచ్చాయని అధికారులు తెలిపారు. డివిజన్లలో హద్దుల మార్పు ఏమైనా జరుగుతుందా, యథావిధిగా ఉంటుందా వేచి చూడాలి.