News April 12, 2025
జగిత్యాల: బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఏర్పాటుకు స్థల పరిశీలన

జగిత్యాల పట్టణంలోని మంచినీళ్ల బావి చౌరస్తా వద్ద బాబు జగ్జీవన్ రాం విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్ శనివారం స్థలం పరిశీలించారు. మహానేత బాబు జగ్జీవన్ రామ్ సేవలు దేశ చరిత్రలో చిరస్మరణీయమని, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం ముందు తరాలకు ప్రేరణగా ఉంటుందని.. ప్రజల కోరిక మేరకు పట్టణంలో ప్రభుత్వా నిబంధనల మేరకు విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు.
Similar News
News November 17, 2025
అల్లూరు: బొలేరో వాహనం బోల్తా.. ఇద్దరు మృతి

అల్లూరు(M) సింగపేట వద్ద భవన నిర్మాణ కార్మికులు వెళుతున్న బొలేరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కావలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఎస్సై శ్రీనివాసరెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తులు కావలి(M) బట్లదిన్నెకు చెందిన శీనయ్య, ప్రసాద్గా గుర్తించారు.
News November 17, 2025
సౌదీలో ఘోర ప్రమాదం.. 42 మంది మృతి

సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్కాలో ప్రార్థనలు ముగించుకుని మదీనాకు వెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి 42 మంది యాత్రికులు సజీవదహనమయ్యారు. ఇందులో 20 మంది మహిళలు, 11 మంది పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులు ఉన్నట్లు నేషనల్ మీడియా తెలిపింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ముఫరహత్ వద్ద ఈ యాక్సిడెంట్ జరిగింది.
News November 17, 2025
ఏపీ న్యూస్ రౌండప్

* కడప జిల్లాలోని పుష్పగిరిలో 13వ శతాబ్దానికి చెందిన శాసనాలను పురావస్తు శాఖ గుర్తించింది.
* కల్తీ నెయ్యి కేసులో నిందితుడైన A24 చిన్న అప్పన్నను నేటి నుంచి 5 రోజులపాటు సిట్ విచారించనుంది. ఇదే కేసులో TTD మాజీ ఛైర్మన్ YV సుబ్బారెడ్డి ఈ నెల 19/20న విచారణకు హాజరుకానున్నారు.
* TTD మాజీ ఏవీఎస్వో సతీశ్ మృతి కేసును గుత్తి రైల్వే పోలీసుల నుంచి తాడిపత్రి పోలీసులకు బదిలీ చేయాలని అధికారులు నిర్ణయించారు.


