News February 3, 2025

జగిత్యాల బీజేపీ అధ్యక్షుడిగా యాదగిరి బాబు

image

జగిత్యాల జిల్లా BJP అధ్యక్షుడిగా మెట్‌పల్లికి చెందిన పార్టీ సీనియర్ నేత రాచకొండ యాదగిరి బాబును నియమిస్తూ పార్టీ అధిష్ఠానం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. నాపై నమ్మకంతో అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించడం సంతోషకరమని.. జిల్లాలో పార్టీ బలోపేతానికి ఎల్లవేళలా కృషి చేస్తానన్నారు. ఇంతకముందు బాబు జిల్లా ప్రధాన కార్యదర్శితోపాటు పార్టీ వేసిన పలు కీలక కమిటీలకు ఛైర్మన్‌గా ఉన్నారు.

Similar News

News December 9, 2025

టెట్ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించాలి: రెవెన్యూ అధికారి

image

జిల్లాలోని 5 పరీక్షా కేంద్రాల్లో ఈ నెల 10 నుంచి ఏపీ టెట్ పరీక్షలు సజావుగా సమర్థవంతంగా నిర్వహించుటకు సిద్ధంగా ఉండాలని జిల్లా రెవెన్యూ అధికారి మురళి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో టెట్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలులో ఉండేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు. వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు.

News December 9, 2025

క్రీడాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా: మంత్రి

image

జిల్లాలో క్రీడాభివృద్ధితో పాటు క్రీడాకారుల సంక్షేమానికి నిరంతరం టీజీవీ సంస్థలు కృషి చేస్తాయని మంత్రి టీజీ భరత్ అన్నారు. ఇటీవల దక్షిణ భారత స్థాయి సిలంబం పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను కర్నూలులోని తన నివాసంలో ఆయన మంగళవారం ఘనంగా సత్కరించారు. జిల్లా కార్యదర్శి మహావీర్ మాట్లాడుతూ.. దక్షిణ భారత స్థాయిలో జిల్లా క్రీడాకారులు అనేక పతకాలు సాధించారన్నారు.

News December 9, 2025

దేవరకద్ర: సర్పంచ్ అభ్యర్థి.. 20 హమీలతో బాండ్

image

దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి బీజేపీ అభ్యర్థిగా రోజా రమేష్ సర్పంచ్ ఎన్నికల బరిలో దిగారు. తనను గెలిపిస్తే 20 హామీలు నెరవేరుస్తానని బాండ్ పేపర్ రాశారు. వీటిలో ప్రధానంగా శివాజీ విగ్రహం ఏర్పాటు, రోడ్లు, వీధిదీపాలు, గ్రంథాలయం, ఆదాయ వ్యయాలను గ్రామసభలో చూపిస్తానన్నారు. 3 ఏళ్లల్లో 70% హామీలను నెరవేరుస్తామని అన్నారు.