News February 3, 2025

జగిత్యాల బీజేపీ అధ్యక్షుడిగా యాదగిరి బాబు

image

జగిత్యాల జిల్లా BJP అధ్యక్షుడిగా మెట్‌పల్లికి చెందిన పార్టీ సీనియర్ నేత రాచకొండ యాదగిరి బాబును నియమిస్తూ పార్టీ అధిష్ఠానం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. నాపై నమ్మకంతో అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించడం సంతోషకరమని.. జిల్లాలో పార్టీ బలోపేతానికి ఎల్లవేళలా కృషి చేస్తానన్నారు. ఇంతకముందు బాబు జిల్లా ప్రధాన కార్యదర్శితోపాటు పార్టీ వేసిన పలు కీలక కమిటీలకు ఛైర్మన్‌గా ఉన్నారు.

Similar News

News January 16, 2026

మొన్న SETBACK.. నిన్న COMEBACK

image

WPLలో UPW క్రికెటర్ హర్లీన్ డియోల్ బ్యాటుతో అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు. మొన్న DCతో మ్యాచ్‌లో హర్లీన్‌(36 బంతుల్లో 47రన్స్) స్లోగా ఆడుతున్నారనే కారణంతో కోచ్ అభిషేక్ నాయర్ ఆమెను రిటైర్డ్ ఔట్‌గా ప్రకటించి మైదానం నుంచి బయటికి పిలిచారు. ఆ చర్యతో క్రికెట్ అనలిస్టులు సైతం ఆశ్చర్యపోయారు. కాగా తన ఈగో హర్ట్ అయ్యిందేమో అన్నట్లుగా నిన్న MIపై 64(39 బాల్స్) స్కోర్ చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు.

News January 16, 2026

173 పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు

image

NCERTలో 173 పోస్టులకు అప్లై చేయడానికి దరఖాస్తు గడువును పెంచారు. అర్హతగల వారు జనవరి 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్ , డిగ్రీ, డిప్లొమా( ప్రింటింగ్ టెక్నాలజీ, గ్రాఫిక్స్), ITI, B.Tech, M.Tech, PG, MBA, B.L.Sc, M.L.Sc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అర్హులు. రాతపరీక్ష/CBT, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.ncert.nic.in

News January 16, 2026

నల్గొండలో నాగర్ కర్నూల్ జిల్లా వాసి హత్య

image

నల్గొండ రైల్వే స్టేషన్ సమీపంలో దారుణం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లికి చెందిన చంద్రును హత్యకు గురయ్యాడు. రైల్వే పనుల నిమిత్తం నల్గొండ జిల్లాకు వెళ్లిన చంద్రుకు, అక్కడ పని చేస్తున్న కార్మికుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో రాళ్లతో కొట్టి చంపినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న నల్గొండ 2వ టౌన్ ఎస్‌ఐ ఎర్ర సైదులు దర్యాప్తు ప్రారంభించారు.