News April 16, 2025

జగిత్యాల: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం కవితకు వినతి

image

జగిత్యాలకు వచ్చిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసి స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే విధంగా సహకరించాలని కోరుతూ బిసి సంక్షేమ సంఘం నాయకులు బుధవారం వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ, కొక్కు గంగాధర్, రామచంద్రం, రోజా, బొమ్మిడి నరేష్, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News February 25, 2026

SBIలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు నేడే లాస్ట్

image

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. మార్చిలో ఆన్‌లైన్ టెస్టు జరగనుంది. మొత్తం 2,050 పోస్టులు ఉండగా ఏపీలో 97, తెలంగాణలో 80 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులు. వయసు 30 ఏళ్ల కంటే ఎక్కువగా, 21 ఏళ్ల కంటే తక్కువగా ఉండకూడదు. అప్లై చేసేందుకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News February 25, 2026

నిరుద్యోగులకు ALERT.. మార్చి 9 నుంచి అగ్నివీర్ ర్యాలీ

image

AP, TGలకు చెందిన నిరుద్యోగులకు ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ ఓపెన్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ మార్చి 9 నుంచి ప్రారంభం కానుంది. గుంటూరులోని ANUలో ఫిజికల్ టెస్టులు ఉంటాయి. మార్చి 9, 10 తేదీల్లో మహిళలు, 12, 13 తేదీల్లో పురుషులు నేరుగా హాజరుకావొచ్చు. 2005 జులై 2-2009 జనవరి 2 మధ్య జన్మించిన, ఇంటర్/డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు. సర్టిఫికెట్ల జిరాక్స్‌లు, 10 ఫొటోలు తీసుకెళ్లాలి. రిజిస్ట్రేషన్ అవసరం లేదు.

News February 25, 2026

ఇంటర్ పరీక్షల సందర్భంగా పకడ్బందీ బందోబస్తు: ఎస్పీ

image

ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద పకడ్బందీ బందోబస్తు నిర్వహిస్తున్నామని ఎస్పీ మహేశ్ బి.గితే తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పరీక్షా సమయాల్లో పరీక్ష కేంద్రాల పరిసరాలలో 163 బీఎన్ఎస్ యాక్ట్ అమల్లో ఉందని, సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచుతున్నామని వెల్లడించారు.