News April 16, 2025
జగిత్యాల: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం కవితకు వినతి

జగిత్యాలకు వచ్చిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసి స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే విధంగా సహకరించాలని కోరుతూ బిసి సంక్షేమ సంఘం నాయకులు బుధవారం వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ, కొక్కు గంగాధర్, రామచంద్రం, రోజా, బొమ్మిడి నరేష్, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News July 8, 2025
బాధితులకు సత్వర న్యాయం జరగాలి: SP అశోక్ కుమార్

జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డేను నిర్వహించారు. ఈ సందర్భంగా SP అశోక్ కుమార్ మాట్లాడుతూ బాధితులకు సత్వర న్యాయం జరగాలన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 11 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజలకు పోలీస్ శాఖ మరింత చేరువవ్వాలన్నారు.
News July 8, 2025
చర్చకు రాకుంటే కేసీఆర్కు క్షమాపణ చెప్పు: KTR

TG: సీఎం రేవంత్ స్థాయికి కేసీఆర్ అవసరం లేదని, తాము సరిపోతామని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. ‘రేవంత్.. నిజాయితీ, నిబద్ధత ఉంటే చర్చకు రా. లేకపోతే తప్పుడు కూతలు కూసినందుకు, మహా నాయకుడిపై అడ్డగోలుగా మాట్లాడినందుకు ముక్కు నేలకు రాసి KCRకు క్షమాపణలు చెప్పు. చర్చ కోసం రేవంత్ ఎక్కడికి రమ్మన్నా వస్తా. చర్చకు సత్తా లేకపోతే సవాళ్లు చేయొద్దు. సీఎంకు వాతలు పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు’ అని ఫైరయ్యారు.
News July 8, 2025
నేను బాగున్న.. దేశం కోసం పోరాడు: ఆకాశ్ సోదరి

తన సోదరి క్యాన్సర్తో బాధపడుతున్నారని భారత ప్లేయర్ ఆకాశ్ దీప్ <<16971842>>ఎమోషనల్ <<>>అయిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆయన సోదరి మీడియాతో మాట్లాడారు. ‘నేను బాగున్నానని, దేశానికి మంచి చేయడంపై దృష్టి పెట్టాలని ఇంగ్లండ్కు వెళ్లేముందు ఆకాశ్తో చెప్పా. ఆకాశ్ నా గురించి బహిరంగంగా మాట్లాడతారని నాకు తెలియదు. మేము దీన్ని ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడలేదు. కానీ అతను ఎమోషనలై ఈ విషయాన్ని చెప్పాడు’ అని తెలిపారు.