News March 16, 2025

జగిత్యాల: భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య, కుమారులు

image

JGTLరూరల్(M) పొలాసలో పడాల కమలాకర్(60)ను మొదటిభార్య, కుమారులు పెట్రోల్ పోసి శనివారం నిప్పంటించారు. గాయపడిన కమలాకర్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లగా రాత్రి చికిత్స పొందుతూ చనిపోయాడు. పోలీసుల ప్రకారం.. గతంలోనే కమలాకర్ 2 పెళ్లిళ్లు చేసుకున్నాడు. 3వ పెళ్లి చేసుకుని గ్రామంలోనే ఉంటున్నాడు. మద్యంతాగి మొదటి భార్య, కుమారులను వేధించేవాడు. కోపం పెంచుకున్న వారు కమలాకర్‌పై కత్తులతో దాడిచేసి పెట్రోల్ పోసి నిప్పటించారు.

Similar News

News December 24, 2025

శ్రీకాకుళంలో చెట్టుకు ఉరివేసుకుని వ్యక్తి సూసైడ్

image

శ్రీకాకుళం పట్టణంలోని మండల వీధికి చెందిన జాడే కృష్ణ (39) చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు బుధవారం గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. గత మూడు రోజుల క్రితం మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు 1వ పట్టణ ఎస్ఐ రామారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News December 24, 2025

BLO, సూపర్వైజర్ల రెమ్యునరేషన్ భారీగా పెంపు

image

AP: BLO, సూపర్వైజర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. EC ఆదేశాల మేరకు వారి హానరేరియమ్ భారీగా పెంచుతూ GO ఇచ్చింది. యాన్యువల్ రెమ్యునరేషన్‌ను BLOలకు ₹6000 నుంచి ₹12000లకు పెంచింది. BLO సూపర్వైజర్లకు ₹12000 నుంచి ₹18000లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. స్పెషల్ సమ్మరీ రివిజన్, సమ్మరీ రివిజన్లలో పాల్గొన్న వారికి అదనంగా మరో ₹2000 అందించనుంది. 2025 ఆగస్టు నుంచి ఇది అమలవుతుందని పేర్కొంది.

News December 24, 2025

నల్గొండ: ఆడబిడ్డ పుడితే రూ.5 వేలు ఇస్తా: సర్పంచ్

image

నల్గొండ జిల్లా నాంపల్లి మండలం నేమిల్లగూడెం నూతన సర్పంచ్ ఏరెడ్ల నారాయణరెడ్డి తన సొంత ఖర్చుతో ఊరిలో పుట్టిన ప్రతి ఆడబిడ్డకు తన పదవీకాలం ముగిసే వరకు రూ.5,000 ఇస్తానని హామీ ఇచ్చారు. ఆడబిడ్డ పుట్టిందని దిగులు చెందొద్దని, మహాలక్ష్మి లాంటి కూతురు పుట్టిందని గర్వంగా చెప్పుకోవాలన్నారు. ప్రజల సహకారంతో గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. నేటి యువత మాదకద్రవ్యాలకు బానిసలు కావద్దని సూచించారు.