News February 24, 2025

జగిత్యాల: మందుబాబులకు బ్యాడ్ న్యూస్

image

పట్టభద్రలు, టీచర్ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా మూడు రోజులు మద్యం అమ్మకాలు నిలిపేయాలని దుకాణదారులను పోలీసులు ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. దీంతో కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలోని బార్లు, కల్లు దుకాణాలు క్లోజ్ అవుతాయి.

Similar News

News December 3, 2025

అనంతగిరి కొండల్లో పర్యాటకులకు సౌకర్యాలు కల్పించాలి

image

అనంతగిరి కొండల్లో పర్యాటకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని అటవీ సంరక్షణ చార్మినార్ జోన్ అధికారి ప్రియాంక వర్గీస్ పేర్కొన్నారు. బుధవారం అనంతగిరి కొండల్లో ఎకో టూరిజం అభివృద్ధి పనులను కొండపై అటవీ శాఖ అధికారులు చేపట్టిన అభివృద్ధి పనులను, నాటిన మొక్కలను పరిశీలించారు. అడవుల సంరక్షణతో పాటు పర్యాటకులకు అనంతగిరి కొండపై సౌకర్యాలు కల్పించే అభివృద్ధి చేయాలన్నారు.

News December 3, 2025

GNT: ఆ వ్యాధికి.. డీఎంహెచ్ఓ సూచనలు

image

స్క్రబ్ టైఫస్ట్ అనేది జూనోటిక్ వ్యాధి అని, ఓరియన్షియా సుసుగముషి అనే పేడ పురుగు బ్యాక్టీరియాతో వ్యాధి సంక్రమిస్తుందని DMHO విజయలక్ష్మీ తెలిపారు. శరీరం పై నల్లమచ్చల దద్దర్లు,జ్వరం,తలనొప్పి,వణుకు, కండరాల నొప్పులు వ్యాధి లక్షణాలన్నారు. వ్యాధి నిర్థారణ పరీక్ష గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనే అందుబాటులో ఉందన్నారు. శరీరాన్ని పూర్తిగా దుస్తులతో కప్పి ఉంచడం, పొలం పనులు చేసే వారు రబ్బరు బూట్లు ధరించాలన్నారు.

News December 3, 2025

నెల్లూరు జిల్లాలో పెరిగిన పంట నష్టం..!

image

దిత్వా తుఫానుతో నెల్లూరు జిల్లా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లా వ్యాప్తంగా బోగోల్, బుచ్చి, కొడవలూరు, కావలి, కోవూరు,సంగం, అల్లూరు మండలాల పరిధిలో 29 గ్రామాల్లో 116 హెక్టార్లలో నర్సరీ దశలో, 507 హెక్టార్లలో సాగులో ఉన్న వరిపంట దెబ్బతింది. ఇందుకు సంబంధించి 439 మంది రైతులు నష్ట పోయారు. మొంథా తుఫానుతో ఇటీవల చేతికందే దశలో పంట దెబ్బతినగా.. మరోసారి దిత్వా తుఫాన్‌తో మరోసారి రైతులకు నష్టం వాటిల్లింది.