News February 24, 2025
జగిత్యాల: మందుబాబులకు బ్యాడ్ న్యూస్

పట్టభద్రలు, టీచర్ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా మూడు రోజులు మద్యం అమ్మకాలు నిలిపేయాలని దుకాణదారులను పోలీసులు ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. దీంతో కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలోని బార్లు, కల్లు దుకాణాలు క్లోజ్ అవుతాయి.
Similar News
News November 26, 2025
GNT: ఈ పరిస్థితి మీ ప్రాంతంలో కూడా ఉందా.?

ఏపీలో స్థానిక సంస్థలు ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా పలువురు నాయకులు సేఫ్ జోన్ వెతుక్కుంటున్నారు. ఇతర పార్టీలకు చెందినవారు అధికార పార్టీ వైపు క్యూ కడుతున్నారు. గతంలో వ్యతిరేకంగా పనిచేసినవారె, ఇప్పుడు కూటమి వైపు మొగ్గు చూపుతున్నట్లు స్థానికంగా ప్రచారం సాగటంతో, మళ్లీ వారికే ప్రాముఖ్యత వస్తె తమ పరిస్థితి ఏమిటని? కూటమి వాపోతున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
News November 26, 2025
నా భవిష్యత్తుపై బీసీసీఐదే నిర్ణయం: గంభీర్

సౌతాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్ ఓటమి అనంతరం IND హెడ్ కోచ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన భవిష్యత్తుపై BCCI నిర్ణయం తీసుకుంటుందన్నారు. ‘నేను పదవిలో కొనసాగడానికి అర్హత ఉందా లేదా అనేది బోర్డు డిసైడ్ చేస్తుంది. భారత క్రికెట్ మాత్రమే ముఖ్యం. నేను కాదు’ అని పేర్కొన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ గెలిచినప్పుడూ తానే కోచ్గా ఉన్నానని గుర్తు చేశారు. తాజా ఓటమికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలన్నారు.
News November 26, 2025
నెల్లూరు జిల్లాలో దారుణ హత్య

నెల్లూరు జిల్లాలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. జలదంకి మండలం గట్టుపల్లి చింతలపాలెం వద్ద తన కోళ్ల ఫారంలో నిద్రిస్తున్న టీడీపీ నేత గొట్టిపాటి ప్రసాద్ని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. ఘటనా స్థలానికి చేరుకొని జలదంకి పోలీసులు విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


