News February 13, 2025
జగిత్యాల: మాటలకే పరిమితం కావొద్దు: MLC జీవన్ రెడ్డి

రాజకీయ పార్టీ నాయకులు మాటలకు పరిమితంగా కాకూడదని, చేతల్లో నిరూపించాలని కాంగ్రెస్ MLC జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాలలోని ఇందిరా భవన్లో ప్రభుత్వ విప్ లక్ష్మణ్తో కలిసి గురువారం నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. బండి సంజయ్ మత విద్వేషాలను రెచ్చగొట్టే పని చేయకుండా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ వచ్చేలా సహకరించాలని కోరారు. రిజర్వేషన్లను మతంతో ముడిపెట్టడం సరికాదన్నారు.
Similar News
News November 18, 2025
NLG: మిల్లు బయటే వారం రోజులుగా ధాన్యం లారీ

నల్గొండ(M) శేషమ్మగూడెం PACS ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి కొనుగోలు చేసిన ధాన్యం తిప్పర్తి(M) అనిశెట్టి దుప్పలపల్లిలోని మిల్లు బయటే వారం రోజులుగా నిలిచిపోయింది. ధాన్యం లోడును మిల్లుకు తరలించగా, బాగా లేదనే కారణంతో మిల్లు యాజమాన్యం తిరస్కరించింది. 7 రోజులుగా ధాన్యాన్ని దిగుమతి చేసుకోకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రైతులు వాపోయారు. వర్షం వస్తే ధాన్యం పరిస్థితి ఏంటని దిగులు చెందుతున్నారు.
News November 18, 2025
NLG: మిల్లు బయటే వారం రోజులుగా ధాన్యం లారీ

నల్గొండ(M) శేషమ్మగూడెం PACS ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి కొనుగోలు చేసిన ధాన్యం తిప్పర్తి(M) అనిశెట్టి దుప్పలపల్లిలోని మిల్లు బయటే వారం రోజులుగా నిలిచిపోయింది. ధాన్యం లోడును మిల్లుకు తరలించగా, బాగా లేదనే కారణంతో మిల్లు యాజమాన్యం తిరస్కరించింది. 7 రోజులుగా ధాన్యాన్ని దిగుమతి చేసుకోకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రైతులు వాపోయారు. వర్షం వస్తే ధాన్యం పరిస్థితి ఏంటని దిగులు చెందుతున్నారు.
News November 18, 2025
దేశాధినేతలు.. మరణశిక్షలు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు అక్కడి తాత్కాలిక ప్రభుత్వం నిన్న <<18311462>>మరణశిక్ష<<>> విధించింది. ఇలా దేశాధినేతలు ఉరిశిక్ష ఎదుర్కోవడం గతంలోనూ జరిగింది. పాక్లో జుల్ఫికర్ అలీ బుట్టో, తుర్కియేలో అద్నాన్ మెండెరెస్, ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్లకు మరణశిక్ష అమలైంది. సౌత్ కొరియాలో చున్ డూ హ్వాన్కు విధించిన ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. పాక్లో ముషారఫ్ మరణశిక్షను తర్వాత రద్దు చేశారు.


