News February 4, 2025

జగిత్యాల మార్కెట్లో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం

image

మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో జగిత్యాల మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని జిల్లా మార్కెటింగ్ అధికారి డీ.ప్రకాష్ నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు నాణ్యమైన కందులను ఈ కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి రూ.7,550 కనీస మద్దతు ధర పొందాలన్నారు. తక్కువ ధరకు దళారులకు అమ్మవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో మార్క్ఫెడ్ డీఎం హబీబ్, మార్కెట్ కార్యదర్శి రాజశేఖర్ పాల్గొన్నారు.

Similar News

News November 17, 2025

శుభ సమయం (17-11-2025) సోమవారం

image

✒ తిథి: బహుళ త్రయోదశి తె.5.09 వరకు
✒ నక్షత్రం: చిత్త తె.5.20 వరకు
✒ శుభ సమయాలు: సా.7.45-8.10.
✒ రాహుకాలం: ఉ.7.30-9.00 వరకు
✒ యమగండం: ఉ.10.30-మ.12.00
✒ దుర్ముహూర్తం: మ.12.24-1.12 వరకు, మ.2.46-3.34
✒ వర్జ్యం: మ.12.04-1.40
✒ అమృత ఘడియలు: రా.10.49-12.31

News November 17, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 17, సోమవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.07 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.22 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.55 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 17, 2025

పెద్దపల్లి: అన్నను కలిసి వెళ్తుండగా అనంతలోకాలకు

image

సెలవురోజు కావడంతో అన్నను కలవడానికి వచ్చిన బాలికను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. SI శ్రావణ్ కుమార్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా బీర్పూర్(M) తోంగూర్‌కు చెందిన దాట శివాసిని(8) అన్న దాట శ్రావణ్ సుల్తానాబాద్లోని గురుకులంలో చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి పాఠశాలకు వచ్చింది. అన్నను కలిసి తిరిగెళ్తుండగా బొలెరో ట్రాలీ ఢీకొనడంతో చనిపోయింది.