News February 4, 2025
జగిత్యాల మార్కెట్లో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం

మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో జగిత్యాల మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని జిల్లా మార్కెటింగ్ అధికారి డీ.ప్రకాష్ నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు నాణ్యమైన కందులను ఈ కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి రూ.7,550 కనీస మద్దతు ధర పొందాలన్నారు. తక్కువ ధరకు దళారులకు అమ్మవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో మార్క్ఫెడ్ డీఎం హబీబ్, మార్కెట్ కార్యదర్శి రాజశేఖర్ పాల్గొన్నారు.
Similar News
News February 11, 2026
అయ్యప్ప దీక్షతో ఆరోగ్య రహస్యాలు

అయ్యప్ప దీక్ష ఆత్మస్థైర్యానికి శిక్షణ. సూర్యోదయానికి ముందే చన్నీటి స్నానం శరీర ఉష్ణోగ్రత క్రమబద్ధీకరించి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. క్షవరం చేయకపోవడం దేహంపై మోహాన్ని తగ్గించి, చలి నుంచి రక్షణనిస్తుంది. వేడిని గ్రహించే నలుపు వస్త్రాలు వైరాగ్యానికి ప్రతీకలు. పాదరక్షలు విడిస్తే కష్టాలు తట్టుకునే కఠినత్వం అలవడుతుంది. ఇలా ప్రతి నియమం భక్తుడిని శారీరక దృఢత్వం, ఆధ్యాత్మిక ఉన్నతి వైపు నడిపిస్తుంది.
News February 11, 2026
అసెంబ్లీ సమావేశాలకు జగన్.. ‘వార్’ తప్పదా?

AP: నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలు కానున్నాయి. ఇవాళ బడ్జెట్పై గవర్నర్ ప్రసంగించనున్న నేపథ్యంలో YCP చీఫ్ జగన్, పార్టీ ఎమ్మెల్యేలు, MLCలు హాజరవుతారని విపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. గత బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం తర్వాత జగన్ సభ నుంచి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈసారీ పూర్తిగా హాజరవడం అనుమానమే. ఒకవేళ హాజరైతే కల్తీ నెయ్యి అంశంపై కూటమి, YCP నేతల మధ్య వార్ ఖాయంగా కనిపిస్తోంది.
News February 11, 2026
రైతులకు మార్కెట్ భరోసా కల్పించాలి: VZM కలెక్టర్

రైతులకు మార్కెట్ సదుపాయం ఉందన్న భరోసా కల్పించినప్పుడే ఉద్యానమిషన్ విజయవంతం అవుతుందని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఉద్యాన మిషన్ పై జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం సాయంత్రం సమీక్షించారు. జిల్లాలో ఈ ఏడాది పదివేల ఎకరాల్లో అదనంగా ఉద్యాన పంటలను సాగు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీనిలో భాగంగా రబీలో ఇప్పటికే అదనంగా సుమారు 3,300 ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు జరిగిందన్నారు.


