News February 2, 2025
జగిత్యాల మార్కెట్లో ధరలిలా..

జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో శనివారం పలికిన ధరలు ఇలా ఉన్నాయి. కందులు క్వింటాల్ కనిష్ఠ ధర రూ.5,350, గరిష్ఠ ధర రూ.6,289గా పలికింది. అటు అనుములు క్వింటాల్ కనిష్ఠ ధర రూ.7,222, గరిష్ఠ ధర రూ.7,360. మక్కలు రూ.2,300, వరి ధాన్యం(1010) రూ.1,651, నువ్వులు రూ.9,511గా పలికాయని మార్కెట్ కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు.
Similar News
News November 17, 2025
మదనాపూర్: కురుమూర్తి స్వామిని దర్శించుకున్న జపాన్ దేశస్థులు

దేవరకద్ర నియోజకవర్గంలోని కురుమూర్తి స్వామి దేవస్థానాన్ని సోమవారం ఉదయం జపాన్ దేశస్థులు దర్శించుకున్నారు. వారు స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వారికి ఘనంగా స్వాగతం పలికారు. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు.
News November 17, 2025
నెల్లూరు జిల్లాలో 10th విద్యార్థులకు అపార్ గండం

విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం 10th విద్యార్థులకు గండంగా మారింది. NEP ప్రకారం విద్యార్థులందరికీ అపార్ గుర్తింపు కార్డు, పర్మినెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ (PEN) ఉండాలి. స్కూల్ రికార్డ్లోని వివరాలు, విద్యార్థి ఆధార్ వివరాలు అక్షరం తప్పు లేకుండా సరిపోయిన విద్యార్థులకు APAAR. ID, PEN లభిస్తాయి. అవి ఉంటేనే 10th పరీక్ష ఫీజు చెల్లింపు అవుతుంది. వేల మంది విద్యార్థులకు ఈ ప్రక్రియ ఇంకా పెండింగ్లో ఉంది.
News November 17, 2025
అంగన్వాడీ కేంద్రాల ద్వారా బలమైన బాల్యం: సీతక్క

బాల్యంలోనే చిన్నారులు ఆరోగ్యంగా ఉంటే భవిష్యత్తు బలంగా ఉంటుందని మంత్రి సీతక్క అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు క్రమం తప్పకుండా పౌష్ఠికాహారం అందిస్తున్నామని తెలిపారు. గర్భిణీలు, బాలింతలకు పుష్ఠికరమైన ఆహార పదార్థాలను అందిస్తున్నామన్నారు. కుళ్లిపోయిన కోడిగుడ్లు, నాసిరకం పాలను సరఫరాచేసే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చంటి పిల్లలు దేవుళ్లతో సమాని, వారిని సంరక్షిస్తామన్నారు.


