News February 6, 2025

జగిత్యాల మార్కెట్లో నేటి ధరలు ఇలా

image

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో నేటి దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. కందులు క్వింటాల్ కనిష్ఠ ధర రూ.4,050, గరిష్ఠ ధర రూ.6,418గా నమోదయ్యింది. అనుములు క్వింటాల్ కనిష్ఠ ధర రూ.4,095, గరిష్ఠ ధర రూ.7,955గా ఉంది. మక్కలు ధర రూ.2,222గా ఉంది. ధాన్యం (1010) ధర రూ.1,655గా ఉండగా, ధాన్యం (JSR) ధర రూ.2,653గా ఉంది. ఈ వివరాలను మార్కెట్ కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు.

Similar News

News November 13, 2025

నేవీకి అవసరమైన భూమి ఇచ్చేందుకు సిద్ధం: సీఎం

image

విశాఖను దేశంలోనే బెస్ట్ టూరిజం డెస్టినేషన్‌గా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. సీఐఐ సమ్మిట్ సందర్భంగా ఈస్ట్రన్ నావల్ కమాండింగ్ ఇన్‌చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా సీఎంతో భేటీ అయ్యారు. రక్షణ రంగానికి సేవలు అందించే కంపెనీలు, స్టార్టప్‌లను ఆహ్వానించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. నేవీ కార్యకలాపాలకు అవసరమైన భూమిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

News November 13, 2025

భారత్, అఫ్గానిస్థాన్‌తో యుద్ధానికి సిద్ధం: పాకిస్థాన్

image

భారత్, అఫ్గానిస్థాన్‌తో ప్రత్యక్ష యుద్ధానికి రెడీగా ఉన్నామని పాకిస్థాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ తెలిపారు. ఇస్లామాబాద్‌లో మంగళవారం జరిగిన సూసైడ్ బాంబ్ బ్లాస్ట్‌లో 12 మంది మరణించగా 36 మంది గాయపడ్డారు. దాడి చేసింది తామేనని పాకిస్థానీ తాలిబన్ (TTP) ప్రకటించుకున్న తర్వాత ఆసిఫ్ చేసిన కామెంట్లు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భారత మద్దతుతోనే దాడి జరిగిందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆరోపిస్తున్నారు.

News November 13, 2025

జిల్లాలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

image

జగిత్యాల జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. పూడూర్లో కనిష్ఠ ఉష్ణోగ్రత 10.4℃గా నమోదైంది. తిరుమలాపూర్లో 10.5, మల్లాపూర్, మన్నెగూడెం 10.6, గోవిందారం 10.8, మద్దుట్ల 10.9, రాఘవపేట, కత్లాపూర్ 11.0, గొల్లపల్లి 11.1, నేరెళ్ల 11.2, మల్యాల 11.3, పెగడపల్లి 11.4, సారంగాపూర్ 11.5, జగ్గసాగర్ 11.7, పొలాస 11.9, కోరుట్ల, ఐలాపూర్ 12, గోదూరులో 12.2℃ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.