News March 6, 2025
జగిత్యాల: మిల్లర్లు సీఎంఆర్ బకాయిలు చెల్లించాలి: అడిషనల్ కలెక్టర్

ఈనెల 17 లోగా రైస్ మిల్లర్లు సీఎంఆర్ బకాయిలు చెల్లించాలని అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత ఆదేశించారు. జగిత్యాల కలెక్టరేట్లో యాసంగి 2023-24 కు సంబంధించి సీఎంఆర్ చెల్లింపులపై బాయిల్డ్ రైస్ మిల్లర్లతో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. బకాయిలు చెల్లించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి, మేనేజర్, రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 6, 2025
దూడపై చిరుతపులి దాడి.?

ఐరాల మండలం వడ్రంపల్లిలో బుధవారం రాత్రి ఓ అడవి జంతువు దూడపై దాడి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. పాదముద్రల ఆధారంగా చిరుతపులి డాడి చేసినట్లు వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన కాణిపాకం ఆలయానికి 4 కిలోమీటర్ల సమీపంలో జరిగింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి బయలుదేరారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
News November 6, 2025
TG SETకు దరఖాస్తు చేశారా?

అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ లెక్చరర్షిప్కు అర్హత సాధించే <
News November 6, 2025
పెరిగిన బంగారం, వెండి ధరలు

గత రెండు రోజులుగా తగ్గిన బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రా. గోల్డ్ రూ.430 పెరిగి రూ.1,21,910కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రా. పసిడి రూ.400 పెరిగి రూ.1,11,750 పలుకుతోంది. అటు కేజీ వెండి రేటు రూ.1,000 పెరిగి రూ.1,64,000గా ఉంది.


