News March 7, 2025

జగిత్యాల: మూడవరోజు ప్రశాంతంగా ముగిసిన పరీక్షలు

image

జగిత్యాల జిల్లాలో నేడు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్‌లో మొత్తం 7313 మంది విద్యార్థులకు గాను 7108 విద్యార్థులు హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి తెలిపారు. 205 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్ కోర్సులకు సంబంధించిన విద్యార్థులు 6271 మందికి 6144 విద్యార్థులు హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సులకు సంబంధించిన విద్యార్థులు 1042 మందికి 964 విద్యార్థులు హాజరయ్యారన్నారు.

Similar News

News October 22, 2025

కన్నుల పండువగా కురుమూర్తి స్వామి కళ్యాణ మహోత్సవం

image

శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎంతో కమనీయంగా జరిగింది. వేద పండితులు, అర్చకుల మంత్రోచ్ఛారణ మధ్య స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. కురుమూర్తి స్వామి గిరులు “కురుమూర్తి వాసా గోవింద” నామ స్మరణతో మార్మోగాయి.

News October 22, 2025

‘పేరు వల్లే’ సర్ఫరాజ్‌ సెలక్ట్ కాలేదా: షమా

image

సౌతాఫ్రికా-Aతో పంత్ సారథ్యంలో ఆడనున్న టీమ్ ఇండియా-A జట్టులో సర్ఫరాజ్ ఖాన్‌ను ఎంపిక చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘ఖాన్ అనే ఇంటిపేరు వల్లే సర్ఫరాజ్‌ను ఎంపిక చేయలేదా? జస్ట్ ఆస్కింగ్. ఇలాంటి విషయంలో గంభీర్ ఎలా వ్యవహరిస్తారో మనకు తెలుసు’ అని AICC అధికార ప్రతినిధి షమా మహ్మద్ ట్వీట్ చేశారు. టీమ్ ఇండియాని కాంగ్రెస్ మతం పేరుతో వేరు చేయాలని చూస్తోందని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

News October 22, 2025

AP న్యూస్ రౌండప్

image

*పాయకరావుపేట నియోజకవర్గంలోనే లక్ష ఉద్యోగాలిస్తాం: హోంమంత్రి అనిత
*కూలిన విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించాలని అధికారులకు మంత్రి గొట్టిపాటి ఆదేశం
*కడప జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఉగ్రవాది అబూబకర్‌ సిద్ధికి భార్య సైరాబానును కస్టడీకి తీసుకుని VJA తరలించిన NIA అధికారులు
*గుంటూరు(D) ఇటికంపాడు రోడ్డు శివారులో పిడుగుపాటుకు మరియమ్మ(45), షేక్ ముజాహిద(45) అక్కడికక్కడే మృతి