News March 7, 2025

జగిత్యాల: మూడవరోజు ప్రశాంతంగా ముగిసిన పరీక్షలు

image

జగిత్యాల జిల్లాలో నేడు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్‌లో మొత్తం 7313 మంది విద్యార్థులకు గాను 7108 విద్యార్థులు హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి తెలిపారు. 205 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్ కోర్సులకు సంబంధించిన విద్యార్థులు 6271 మందికి 6144 విద్యార్థులు హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సులకు సంబంధించిన విద్యార్థులు 1042 మందికి 964 విద్యార్థులు హాజరయ్యారన్నారు.

Similar News

News November 26, 2025

GNT: ఈ పరిస్థితి మీ ప్రాంతంలో కూడా ఉందా.?

image

ఏపీలో స్థానిక సంస్థలు ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా పలువురు నాయకులు సేఫ్ జోన్ వెతుక్కుంటున్నారు. ఇతర పార్టీలకు చెందినవారు అధికార పార్టీ వైపు క్యూ కడుతున్నారు. గతంలో వ్యతిరేకంగా పనిచేసినవారె, ఇప్పుడు కూటమి వైపు మొగ్గు చూపుతున్నట్లు స్థానికంగా ప్రచారం సాగటంతో, మళ్లీ వారికే ప్రాముఖ్యత వస్తె తమ పరిస్థితి ఏమిటని? కూటమి వాపోతున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.

News November 26, 2025

నా భవిష్యత్తుపై బీసీసీఐదే నిర్ణయం: గంభీర్

image

సౌతాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్ ఓటమి అనంతరం IND హెడ్ కోచ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన భవిష్యత్తుపై BCCI నిర్ణయం తీసుకుంటుందన్నారు. ‘నేను పదవిలో కొనసాగడానికి అర్హత ఉందా లేదా అనేది బోర్డు డిసైడ్ చేస్తుంది. భారత క్రికెట్ మాత్రమే ముఖ్యం. నేను కాదు’ అని పేర్కొన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ గెలిచినప్పుడూ తానే కోచ్‌గా ఉన్నానని గుర్తు చేశారు. తాజా ఓటమికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలన్నారు.

News November 26, 2025

నెల్లూరు జిల్లాలో దారుణ హత్య

image

నెల్లూరు జిల్లాలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. జలదంకి మండలం గట్టుపల్లి చింతలపాలెం వద్ద తన కోళ్ల ఫారంలో నిద్రిస్తున్న టీడీపీ నేత గొట్టిపాటి ప్రసాద్‌ని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. ఘటనా స్థలానికి చేరుకొని జలదంకి పోలీసులు విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.