News February 3, 2025

జగిత్యాల: మొదలైన ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్..

image

నేటి నుంచి ఇంటర్ రెండో సంవత్సరం ప్రాక్టికల్స్‌ ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయని, నాలుగు స్పెల్స్‌లో జరుగుతాయని జగిత్యాల ఇంటర్‌ నోడల్‌ అధికారి బొప్పరాతి నారాయణ తెలిపారు. పరీక్షలు వచ్చేనెల 25వ తేదీ వరకు జరగనున్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా ఫస్టియర్‌లో 7,054 మంది, సెకండియర్‌లో 6,141 మంది పరీక్షలు రాయనున్నారని చెప్పారు. ప్రాక్టికల్స్‌‌కు 29 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News December 9, 2025

గద్వాల్: నేటితో ముగియనున్న ప్రచారం

image

తొలి విడుత పంచాయతీ సమరం రెండు రోజుల్లో ముగియనుంది. జిల్లాలో ధరూర్, గద్వాల్, గట్టు, కేటిదొడ్డి మండలాల్లో మొదటి విడుత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 106 గ్రామ పంచాయతీ, 974 వార్డు మెంబర్లకు గాను 14 సర్పంచ్, 120 వార్డు ఏకగ్రీవమయ్యాయి. మిగతా వాటికి పోరు జరగనుంది. నేటితో ప్రచారానికి END కార్డు పడనుంది.

News December 9, 2025

మచ్చలు పడుతున్నాయా?

image

చాలామంది మహిళలు తప్పు సైజు, నాణ్యత తక్కువగా ఉన్న లోదుస్తులను వాడతారు. దీని వల్ల కొన్నిసార్లు చర్మంపై మచ్చలు పడే అవకాశం ఉంది. వీటిని పోగొట్టడానికి కొన్ని ఇంటి చిట్కాలు. * స్పూన్ పంచదారలో నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని మచ్చలున్న చోట రాసి మర్దనా చేయాలి. * పాలు, బాదం నూనెలను కలిపి మచ్చలున్న ప్రాంతాల్లో రాయాలి. * పెరుగులో చిటికెడు పసుపు కలిపి, ఆ మిశ్రమాన్ని మచ్చలు ఉన్న దగ్గర రాస్తే మార్పు కనిపిస్తుంది.

News December 9, 2025

ఆర్థిక సమస్యలను తొలగించే ‘ద్వార లక్ష్మీ పూజ’

image

ఇంటి గడపను లక్ష్మీ ద్వారంగా భావించి, దేవతలను ఆహ్వానించడానికి పసుపు, కుంకుమలతో అలంకరిస్తాం. అయితే 16 రోజులు ‘ద్వార లక్ష్మీ పూజ’ ఆచరిస్తే ఆర్థిక సమస్యలు తొలగి, కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా పెళ్లికాని ఆడపిల్లలు, జాతక దోషంతో బాధపడుతున్నవారు ఈ పూజ చేయాలని సూచిస్తున్నారు. లక్ష్మీ ద్వార పూజ ఎప్పుడు, ఎలా చేయాలి? పూజా ఫలితాలు తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.