News February 3, 2025
జగిత్యాల: మొదలైన ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్..

నేటి నుంచి ఇంటర్ రెండో సంవత్సరం ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయని, నాలుగు స్పెల్స్లో జరుగుతాయని జగిత్యాల ఇంటర్ నోడల్ అధికారి బొప్పరాతి నారాయణ తెలిపారు. పరీక్షలు వచ్చేనెల 25వ తేదీ వరకు జరగనున్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా ఫస్టియర్లో 7,054 మంది, సెకండియర్లో 6,141 మంది పరీక్షలు రాయనున్నారని చెప్పారు. ప్రాక్టికల్స్కు 29 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News November 22, 2025
బైజూస్కు షాక్.. రూ.8,900 కోట్లు చెల్లించాలని తీర్పు

బైజూస్ సంస్థ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్ రూ.8,900 కోట్లు చెల్లించాలని అమెరికా కోర్టు ఆదేశించింది. బైజూస్ ఆల్ఫా, అమెరికాకు చెందిన గ్లాస్ ట్రస్ట్ కంపెనీ ఎల్ఎల్సీ దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు వినకుండానే డెలావేర్లోని దివాలా కోర్టు భారీ ఫైన్ విధిస్తున్నట్టు ప్రకటించింది. బైజూస్ ఆల్ఫా నెలకొల్పి 1 బిలియన్ లోన్ పొందారని, రూల్స్ అతిక్రమించి 533 మిలియన్ డాలర్లను తరలించారనే ఆరోపణలపై కేసు నమోదు చేశారు.
News November 22, 2025
బైజూస్కు షాక్.. రూ.8,900 కోట్లు చెల్లించాలని తీర్పు

బైజూస్ సంస్థ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్ రూ.8,900 కోట్లు చెల్లించాలని అమెరికా కోర్టు ఆదేశించింది. బైజూస్ ఆల్ఫా, అమెరికాకు చెందిన గ్లాస్ ట్రస్ట్ కంపెనీ ఎల్ఎల్సీ దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు వినకుండానే డెలావేర్లోని దివాలా కోర్టు భారీ ఫైన్ విధిస్తున్నట్టు ప్రకటించింది. బైజూస్ ఆల్ఫా నెలకొల్పి 1 బిలియన్ లోన్ పొందారని, రూల్స్ అతిక్రమించి 533 మిలియన్ డాలర్లను తరలించారనే ఆరోపణలపై కేసు నమోదు చేశారు.
News November 22, 2025
‘వాలంటీర్’పై పెద్దిరెడ్డి కామెంట్స్.. మీరేమంటారు.?

ఇకపై తమ ప్రభుత్వంలో ‘<<18352308>>వాలంటీర్ వ్యవస్థ<<>>’ ఉండదన్న పెద్దిరెడ్డి వ్యాఖ్యలపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు ప్రత్యక్షంగా సంక్షేమ ఫలాలను అందించే విధంగా జగన్ దీనిని ఏర్పాటు చేశారు. ఓ రకంగా ఎన్నికల్లో ఓడిపోవడానికి ఈ వ్యవస్థ కారణం అని ఆ పార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారట. దీంతో 2029లో YCP అధికారం చేపట్టినా వాలంటీర్ వ్యవస్థపై మొగ్గు చూపే ప్రసక్తే లేదని పెద్దిరెడ్డి వ్యాఖ్యలతో తేలిపోయింది.


