News February 16, 2025
జగిత్యాల: మొన్న తల్లి మృతి.. నేడు పిల్లలు

JGTL(D) పెగడపల్లి(M) మద్దులపల్లి గ్రామానికి చెందిన <<15470497>>కంబాల హారిక<<>> తన ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి తానూ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోగా హారిక శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె కొడుకు కృష్ణంత్(10), కూతురు మయంత లక్ష్మి(8) HYDలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఎస్సై రవికిరణ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News October 31, 2025
SRCL: ఏరియల్ సర్వేలో పాల్గొన్న కలెక్టర్లు

భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంపై హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖలతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు వికాస్ రాజ్, అరవింద్ కుమార్, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి, సిరిసిల్ల ఇన్ఛార్జి కలెక్టర్ గరీమ అగర్వాల్ పాల్గొన్నారు. వరద నష్టాన్ని అంచనా వేయడంపై చర్చించారు.
News October 31, 2025
సిరిసిల్ల అబ్బాయి.. ఫ్రాన్స్ అమ్మాయి

తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువకుడితో ఫ్రాన్స్ అమ్మాయికి శుక్రవారం ఘనంగా వివాహం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బుచ్చ చైతన్య గౌడ్ ఉద్యోగరీత్యా ఫ్రాన్స్ ఉంటున్నాడు. అక్కడ యువతి శాన్వి (ఇమాన్ బెన్)తో ప్రేమలో పడ్డాడు. పెద్దల అంగీకారంతో శుక్రవారం అబ్బాయి ఇంటి ముందు సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు.
News October 31, 2025
ప్రైవేటు ఆసుపత్రుల్లో రేపటి నుంచి డా. ఎన్టీఆర్ వైద్య సేవలు

ప్రైవేటు ఆసుపత్రుల్లో డా. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద యథావిధిగా వైద్య సేవలు అందించనున్నట్లు తూ.గో జిల్లా సమన్వయాధికారి పి. ప్రియాంక శుక్రవారం తెలిపారు. ప్రభుత్వం, ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాల మధ్య చర్చలు సఫలం కావడంతో శనివారం నుంచి సేవలు పునఃప్రారంభం అవుతాయన్నారు. జిల్లాలోని 45 ప్రైవేటు ఆసుపత్రులు ఈ పథకం కింద ఉచిత వైద్య సేవలు అందిస్తాయని వెల్లడించారు.


