News February 16, 2025

జగిత్యాల: మొన్న తల్లి మృతి.. నేడు పిల్లలు

image

JGTL(D) పెగడపల్లి(M) మద్దులపల్లి గ్రామానికి చెందిన <<15470497>>కంబాల హారిక<<>> తన ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి తానూ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోగా హారిక శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె కొడుకు కృష్ణంత్(10), కూతురు మయంత లక్ష్మి(8) HYDలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఎస్సై రవికిరణ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 18, 2025

నామినేటెడ్ పోస్టుల్లో అర్బన్ నక్సల్స్: బండి సంజయ్

image

అర్బన్ నక్సల్స్ నామినేటెడ్ పోస్టులు, కమీషన్లు వచ్చే పదవుల్లో కొనసాగుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. వేములవాడ ఏరియా ఆసుపత్రిలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వంతో అర్బన్ నక్సల్స్ కుమ్మక్కై నామినేటెడ్ పోస్టులు, కమిషన్ పదవులు అనుభవిస్తున్నారన్నారు. వారి మాయ మాటలు నమ్మి అమాయక దళిత, గిరిజనులు తుపాకీ పట్టుకుని అడవుల్లో ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు.

News November 18, 2025

అనకాపల్లి: ‘టీచర్లు సమస్యలు పరిష్కరించాలని వినతి”

image

ఏకోపాధ్యాయ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి, ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం అనకాపల్లిలో డీఈవో అప్పారావు నాయుడిని కలిసి వినతిపత్రం అందజేశారు. వారు సెలవు పెడితే వారి స్థానంలో సర్ప్లస్ టీచర్స్‌ను డిప్యూటేషన్‌పై పంపించాలన్నారు. 2024-25లో స్పాట్ వాల్యూషన్ ఉపాధ్యాయులకు డీఏ చెల్లించాలన్నారు.

News November 18, 2025

TU: పీజీ ద్వితీయ సెమిస్టర్ ఫలితాలు విడుదల చేసిన వీసీ

image

తెలంగాణ యూనివర్సిటీలో ఆగస్టు/సెప్టెంబర్‌లో జరిగిన పీజీ (ఎం.ఏ/ఎమ్మెస్సీ/ఎం.కామ్) ద్వితీయ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను ఉపకులపతి (వీసీ) ప్రొఫెసర్ టి.యాదగిరి రావు మంగళవారం విడుదల చేశారు. రిజిస్ట్రార్ ప్రొ. ఎం.యాదగిరి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొ.కే.సంపత్ కుమార్‌లతో కలిసి వీసీ ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొ.ఘంటా చంద్రశేఖర్, డా.టి. సంపత్ పాల్గొన్నారు.