News February 16, 2025

జగిత్యాల: మొన్న తల్లి మృతి.. నేడు పిల్లలు

image

JGTL(D) పెగడపల్లి(M) మద్దులపల్లి గ్రామానికి చెందిన <<15470497>>కంబాల హారిక<<>> తన ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి తానూ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోగా హారిక శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె కొడుకు కృష్ణంత్(10), కూతురు మయంత లక్ష్మి(8) HYDలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఎస్సై రవికిరణ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 26, 2025

కామారెడ్డి జిల్లాలో రేపు కవిత పర్యటన

image

TG జాగృతి చీఫ్ కవిత రేపు కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్, నిజాంసాగర్ ప్రాజెక్టులను సందర్శించనున్నారు. బాన్సువాడలో సోషల్ వెల్ఫేర్ జూ.కళాశాలను సందర్శించి, నాగిరెడ్డిపేటలో ముంపు రైతులతో సమావేశం కానున్నారు. నాగన్న బావి, శబరిమాత ఆశ్రమాన్ని సందర్శిస్తారు. కానిస్టేబుల్ కిష్టయ్య విగ్రహానికి నివాళులర్పించి, రైలు ప్రమాదంలో చనిపోయిన సుధాకర్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.

News November 26, 2025

అంబేద్కర్ చూపిన మార్గంలో నడవాలి: ఎస్పీ

image

కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో బుధవారం రాజ్యాంగ దినోత్సవం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. పౌర హక్కులు, కర్తవ్యాలు, రాజ్యాంగం విలువలు తెలుసుకోవాలన్నారు. రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ, ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.

News November 26, 2025

గ్లోబల్ సమ్మిట్: పెట్టుబడిదారుల దృష్టికి సౌకర్యాల జాబితా

image

డిసెంబర్ 8, 9 తేదీల్లో పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలనూ చేస్తోంది. ముఖ్యంగా ఇక్కడ సర్కారు కల్పించనున్న సౌకర్యాలను వారికి కూలంకుషంగా వివరించనుంది. ORR, RRR, IRR, గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి, బందర్ పోర్టు వరకు మార్గం, కొత్తగా నిర్మించే రైలు మార్గాలు తదితరాలను వారికి అర్థమయ్యేలా ప్రొజెక్ట్ చేయనుంది. ఎప్పుడూ.. ఎక్కడా.. ఎలాంటి సమస్యలు రానివ్వబోమని కచ్చితమైన హామీ ఇవ్వనుంది.