News February 1, 2025
జగిత్యాల: రెండు బైక్లు ఢీ.. యువకుడి మృతి

మెట్పల్లి చింతల్పెట శివారులో శుక్రవారం రాత్రి ఎదురెదురుగా వస్తున్న 2 బైక్లు ఢీకొన్న ఘటనలో ఇబ్రహీంపట్నం వేములకుర్తికి చెందిన బర్మా నగేశ్(32) మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. చింతల్పేట-వేములకుర్తికి వెళ్తున్న నగేశ్.. మెట్పల్లి-యూసుఫ్నగర్కు వస్తున్న సోఫియాన్ బైకులు చింతలపేట శివారులో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నగేశ్ అక్కడికక్కడే మృతి చెందగా సోఫియాన్కు తీవ్ర గాయాలయ్యాయి.
Similar News
News November 4, 2025
నాలాను పరిశీలించిన మేయర్, కమిషనర్

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ పోతన నగర్లో మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ పర్యటించి నాలాను పరిశీలించారు. వరద నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని స్థానిక అధికారులకు వారు సూచనలు చేశారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు మేయర్ సూచనలు చేశారు.
News November 4, 2025
ఏటికొప్పాక హస్తకళలకు కేంద్ర ప్రోత్సాహకం

ఏటికొప్పాక పేరు చెప్పగానే ఎంతో సుందరమైన లక్కబొమ్మల తయారీ పరిశ్రమలు గుర్తుకొస్తాయి. ఎలమంచిలి మండలం ఏటికొప్పాకకు చెందిన హస్త కళాకారులు తమ కళా నైపుణ్యతతో తయారుచేసిన లక్కబొమ్మలకు ఖండాంతర ఖ్యాతి లభించింది. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ రూ.3 కోట్ల వ్యయంతో లక్క బొమ్మల ఎగుమతులకు మార్కెటింగ్, ఇతర సదుపాయాలు కల్పించనుంది. ఈ బాధ్యతలను ఏపీ టూరిజం శాఖకు అప్పగించారు.ఇది హస్త కళాకారులకు ఒక వరమని చెప్పాలి.
News November 4, 2025
సులభంగా డబ్బు వస్తుందంటే నమ్మొద్దు: వరంగల్ పోలీసుల హెచ్చరిక

సులభంగా డబ్బు వస్తుందనే ప్రకటనలను, తెలియని వ్యక్తుల మాటలను నమ్మవద్దని వరంగల్ సైబర్ పోలీసులు ప్రజలకు సూచించారు. ‘ఈజీ మనీ’ ఆశ మిమ్మల్ని నాశనం చేస్తుందని వారు హెచ్చరించారు. సులభంగా డబ్బు వస్తుందనే పథకాల వెనుక ప్రమాదం ఉంటుందని, వెబ్సైట్లు, యాప్లలో మీ వివరాలు ఇవ్వొద్దని తెలిపారు. సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండటమే మీకు శ్రీరామ రక్ష అని పోలీసులు స్పష్టం చేశారు.


