News March 28, 2025

జగిత్యాల: వరి కొనుగోలు కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించాలి

image

రాబోయే యాసంగికి వరిధాన్యం కొనుగోలు కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించాలని అడిషనల్ కలెక్టర్ బిఎస్.లత అన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలు కమిటీ సభ్యులతో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. కేంద్రాలలో తాగునీరు, టాయిలెట్స్, విద్యుత్ కనెక్షన్, ఆన్‌లైన్ వసతి ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు మిల్లుకు వచ్చిన లారీని త్వరితగతిన దిగుమతి చేసుకోవాలని సూచించారు. పలువురు అధికారులు పాల్గొన్నారు.

Similar News

News April 6, 2025

ఒకే ఒక్కడు.. క్రికెట్ చరిత్రలో అరుదైన ఘట్టం

image

PAK బౌలర్ సుఫియాన్ ముఖీమ్ చరిత్ర సృష్టించారు. వరుసగా 2 వన్డేల్లో 12వ స్థానంలో బ్యాటింగ్ చేసిన తొలి క్రికెటర్‌గా నిలిచారు. NZతో జరిగిన రెండో ODIలో హారిస్ రౌఫ్ హెల్మెట్‌కు బంతి బలంగా తాకడంతో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా నసీమ్ వచ్చారు. దీంతో ముఖీమ్ 12వ ప్లేస్‌లో బ్యాటింగ్‌కు దిగారు. మూడో ODIలో ఇమామ్ దవడకు గాయమవడంతో సబ్‌స్టిట్యూట్‌గా ఉస్మాన్ వచ్చారు. దీంతో ముఖీమ్ మరోసారి 12వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగారు.

News April 6, 2025

కనులపండువగా ఎదుర్కోలు వేడుక (PHOTOS)

image

TG: రేపు శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో ఎదుర్కోలు ఉత్సవం ఇవాళ కనులపండువగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రేపు ఉదయం మిథిలా స్టేడియంలో సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. ఇందుకోసం ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానుండటంతో 1800 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

News April 6, 2025

HYDలో రేపు మొత్తం వైన్స్ బంద్..!

image

శ్రీరామనవమిని పురస్కరించుకుని HYD నగరంలోని ట్రై కమిషనరేట్లు HYD, సైబరాబాద్, రాచకొండ పరిధిలో రేపు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వైన్స్ బంద్ ఉంటాయని అధికారులు తెలిపారు. రాచకొండ పోలీసులు నిన్ననే చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా HYD, సైబరాబాద్ పోలీసులు సైతం వెల్లడించారు. కల్లు దుకాణాలు, రెస్టారెంట్ల అనుబంధ బార్లు, మిలిటరీ క్యాంటీన్లు, స్టార్ హోటల్లు, రిజిస్టర్ క్లబ్లలోనూ బంద్ ఉంటాయన్నారు

error: Content is protected !!