News April 9, 2025

జగిత్యాల: విద్యుత్తు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: SE

image

విద్యుత్త ప్రమాదాల పట్ల జాగ్రత్త వహించాలని జగిత్యాల SE సాలియా నాయక్ తెలిపారు. వర్షాలు కురుస్తున్నప్పుడు తడిసిన విద్యుత్ స్తంభాలు, వైరును తాకరాదన్నారు. తెగిపడిన, వేలాడుతున్న, వదులుగా తక్కువ ఎత్తులో ఉన్న తీగలను ముట్టుకోవద్దన్నారు. పశువులను మేతకు తీసుకువెళ్ళినప్పుడు ట్రాన్స్‌ఫార్మర్, స్తంభాల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏదైన సమస్య ఉంటే 1912‌కు ఫోన్ చేయాలన్నారు.

Similar News

News November 21, 2025

స్టేషన్ ఘనపూర్‌కు నూతన చర్మ వైద్య నిపుణురాలు

image

స్టేషన్ ఘనపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ జువేనియా అఫ్రీన్ (డెర్మటాలోజిస్ట్) చర్మ వైద్య నిపుణులు నూతనంగా బాధ్యతలు చేపట్టారు. ఆమె రాకతో చర్మ వ్యాధులకు ఇకపై ఇక్కడే చికిత్స అందనుంది. గతంలో ఇక్కడ డెర్మటాలజిస్ట్‌గా పనిచేసిన డాక్టర్ వీరాంజనేయులు డీసీహెచ్ఎస్ పనిచేసి పదవీ విరమణ పొందారు. సుమారు గత 4 నెలలుగా చర్మ వ్యాధులకు ప్రత్యేక వైద్యులు లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

News November 21, 2025

భూపాలపల్లి: 22న సింగరేణిలో డయల్ యువర్ సీఎండీ

image

సింగరేణి సంస్థలో ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుదల, రక్షణ, వైద్య సేవల మెరుగుదల వంటి అంశాలపై సింగరేణి సంస్థ ఛైర్మన్ ఎన్.బలరామ్ శనివారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు “డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం” నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నదలచిన వారు 040-23311338 నంబర్‌కు కాల్ చేయాలన్నారు. సింగరేణి వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాల కార్మికులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు.

News November 21, 2025

ఖమ్మం: ఇందిరమ్మ చీరల పంపిణీకి మంత్రి తుమ్మల ఆదేశం

image

ఖమ్మం జిల్లాలో 18ఏళ్లు నిండిన ప్రతి గ్రామీణ మహిళకు ఇందిరమ్మ చీరలను ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి అందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌లోపు పంపిణీ పూర్తి చేయాలని సూచించారు. అభివృద్ధి పనులు నాణ్యతతో జరిగేలా చూడాలన్నారు. గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవంగా సర్పంచ్‌లను ఎన్నుకుంటే రూ.10 లక్షల గ్రాంట్ ఇస్తామని మంత్రి ప్రకటించారు.