News April 10, 2024

జగిత్యాల: విషాదం.. యువకుడి ఆత్మహత్య

image

జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో విషాదం జరిగింది. రామన్నపేట గ్రామానికి చెందిన వాకులాబరణం మణిదీప్ (30) ఇంట్లో ఎవరూ లేని సమయంలో బుధవారం ఉదయం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న మల్యాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. అయితే మృతికి గల కారణం తెలియాల్సి ఉంది. మణిదీప్ మృతి పట్ల కుటుంబసభ్యులు రోదిస్తున్నారు.

Similar News

News December 9, 2025

కరీంనగర్ ఆర్టీసీ వన్ డే టూర్ ప్యాకేజీ

image

ఆర్టీసీ కరీంనగర్-1 డిపో ప్రత్యేక వన్ డే టూర్ ప్యాకేజీని ఏర్పాటు చేసినట్లు డి.ఎం. విజయమాధురి తెలిపారు. ఈ ప్యాకేజీలో బీదర్ జలా నరసింహస్వామి, బీదర్ పోర్టు, జరాసంగం, రేజింతల్ సందర్శన ఉంటుంది. ఈ నెల 14న ఉదయం 3:30 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి కరీంనగర్‌కు చేరుకుంటుంది. టికెట్ ధర పెద్దలకు రూ.1,400, పిల్లలకు రూ.1,080గా నిర్ణయించారు. ఆసక్తి గలవారు డిపోలో సంప్రదించాలని సూచించారు.

News December 9, 2025

మెదటి విడత ఎన్నికల ప్రచారం ముగిసింది: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ మెదటి విడత ఎన్నికలకు 9వ తేది సా. 5 గంటల నుంచి ప్రచారానికి తెరపడనున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. పోలింగ్‌కు 44 గంటల ముందు నుంచి ఆయా మండలాలు, గ్రామాల్లో సైలెన్స్ పీరియడ్ అమలులోకి వస్తుందని తెలిపారు. పోలింగ్ ముగిసే వరకు ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, ఏ విధమైన ప్రచారాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ఎన్నికల ఉల్లంఘనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News December 9, 2025

KNR: పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

image

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. కమిషనర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడారు. మెదడి విడతలో 5 మండలాలు గంగాధర, చొప్పదండి, రామడుగు, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్‌లో ఎన్నికలు జరగనున్నాయన్నారు. మొత్తం 92 పంచాయతీలకు గాను మొత్తం 866 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.