News March 19, 2025
జగిత్యాల: వేర్వేరు ఘటనల్లో నలుగురి మృతి

ఉమ్మడి KNR జిల్లాలో నిన్న నలుగురు వివిధ ఘటనల్లో చనిపోయారు. JGTLరూరల్(M) వెల్దుర్తికి చెందిన రాజం(55) అనే <<15808621>>రైతు<<>> అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. బోయినపల్లిలో జరిగిన రోడ్డుప్రమాదంలో గంగాధర(M) ఉప్పరమల్యాలకు చెందిన మల్లేశం(42) చనిపోయాడు. బసంత్నగర్కు చెందిన ఆరె అజయ్(24) అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సైదాపూర్(M) బొమ్మకల్లో నీటి సంపులో పడి పజ్ఞాన్ అనే రెండేళ్ల బాలుడు మృతిచెందాడు.
Similar News
News October 28, 2025
వైద్య వ్యర్థాల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి: నిర్మల్ అదనపు కలెక్టర్

జిల్లాలో వైద్య వ్యర్థాల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం నిర్మల్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వైద్య వ్యర్థాల నిర్వహణపై (బయో మెడికల్ వేస్టేజీ మేనేజ్మెంట్) అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. వైద్య వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వీర్యం చేయాలన్నారు.
News October 28, 2025
మరింత అప్రమత్తంగా ఉందాం: ప్రత్యేక అధికారి

మొంథా తుపాను మంగళవారం రాత్రి 10 నుంచి సుమారు 12 గంటల మధ్య తీరం దాటే అవకాశం ఉందని ప్రత్యేక అధికారి అజయ్ జైన్ వెల్లడించారు. మంగళవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు చేపట్టే ముందస్తు జాగ్రత్తలు సత్ఫలితాలను ఇస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఎంపీ శ్రీభరత్, తదితరులు పాల్గొన్నారు.
News October 28, 2025
జాతీయ రహదారిపై భారీ వాహనాల నిలిపివేత: విశాఖ సీపీ

మొంథా తుఫాను నేపథ్యంలో జాతీయ రహదారిపై భారీ వాహనాలను మంగళవారం రాత్రి 7 గంటల నుంచి నిలిపివేస్తున్నట్లు సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. భారీ గాలులు, వర్షం కురిసే అవకాశం ఉన్నందున ముందస్తుగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అవసరమైతే తప్ప ప్రయాణం చేయొద్దని ఆయన సూచించారు. ప్రజలు, వాహనదారుల సహకరించాలని కోరారు.


