News February 17, 2025

జగిత్యాల వ్యవసాయ మార్కెట్ ధరలు ఇలా..

image

జగిత్యాల మార్కెట్‌లో దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. కందులు క్వింటాల్ ధర రూ.6,311 నుంచి రూ. 7,337 మధ్య పలికాయి. అనుములు రూ.4,089 నుంచి రూ.6,889, అలసందలు రూ.8,000, పెసర్లు రూ.8,500, పల్లికాయ రూ.2,811, నువ్వులు రూ.9,689, మక్కలు రూ.2,106 నుంచి రూ.2,256, వరి ధాన్యం (1010) రూ.1,700 నుంచి రూ.1,755, వరి ధాన్యం (HMT) రూ.2,271, వరి ధాన్యం (JSR) రూ.2,666గా పలికాయి. ఈ మేరకు మార్కెట్ కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు.

Similar News

News December 5, 2025

గన్నవరం చేరుకున్న కన్నడ సూపర్‌ స్టార్

image

కన్నడ సూపర్‌స్టార్ డాక్టర్ శివరాజ్‌ కుమార్‌ శుక్రవారం బెంగళూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. బొండా సిద్ధార్థ, గుమ్మడి నరసయ్య, డైరెక్టర్ పరమేశ్వర్ తదితరులు, అభిమాన సంఘాల నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి శివరాజ్‌ కుమార్‌ ఇంద్రకీలాద్రికి చేరుకొని కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలలో పాల్గొంటారు.

News December 5, 2025

వరంగల్ మార్కెట్లో పెరిగిన పత్తి ధర

image

వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో గత నాలుగు రోజులతో పోలిస్తే నేడు పత్తి ధర పెరిగింది. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం క్వింటా పత్తి ధర రూ.7,100 పలికింది. ఈ క్రమంలో నేడు రూ.50 పెరిగి రూ.7,150 అయినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. దీంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో కొనుగోళ్లు-అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి.

News December 5, 2025

జిల్లాకు ‘ప్రకాశం’ అని నామకరణం చేసింది ఈ రోజే!

image

ఆంధ్ర రాష్ట్ర అవతరణ అనంతరం ఒంగోలు జిల్లా కాస్త ప్రకాశం జిల్లాగా మారింది నేడే. 1970లో జిల్లా ఏర్పడగా, 1972 డిసెంబర్ 5న స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్ర రాష్ట్ర తొలి CM టంగుటూరి ప్రకాశం పంతులు పేరున జిల్లాకు నామకరణం చేశారు. నాగులుప్పలపాడు(M) వినోదరాయునిపాలెంలో జన్మించిన ప్రకాశం పంతులు స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆ మహనీయుడి పేరున ఏర్పడ్డ జిల్లా వాసులుగా గర్విద్దాం.. ఆయన సేవలను కొనియాడుదాం!