News February 17, 2025
జగిత్యాల వ్యవసాయ మార్కెట్ ధరలు ఇలా..

జగిత్యాల మార్కెట్లో దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. కందులు క్వింటాల్ ధర రూ.6,311 నుంచి రూ. 7,337 మధ్య పలికాయి. అనుములు రూ.4,089 నుంచి రూ.6,889, అలసందలు రూ.8,000, పెసర్లు రూ.8,500, పల్లికాయ రూ.2,811, నువ్వులు రూ.9,689, మక్కలు రూ.2,106 నుంచి రూ.2,256, వరి ధాన్యం (1010) రూ.1,700 నుంచి రూ.1,755, వరి ధాన్యం (HMT) రూ.2,271, వరి ధాన్యం (JSR) రూ.2,666గా పలికాయి. ఈ మేరకు మార్కెట్ కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు.
Similar News
News April 10, 2026
బెట్టింగ్ యాప్ ప్రమోట్.. విశాఖలో ఇద్దరి అరెస్ట్

విశాఖలోని బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న ఓ కళాశాల ఫుట్బాల్ కోచ్ గణేశ్తో పాటు అనిల్ కుమార్ను అరెస్ట్ చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. వీరిద్దరూ మధురవాడ భగవాన్ దాస్ కాలనీ ప్రాంతానికి చెందిన వారే. విశాలాక్షి నగర్లో యువకుడ్ని క్రికెట్ ప్రిడిక్షన్ అంటూ నమ్మించి బెట్టింగ్ యాప్ను ప్రోత్సహించారు. వీరి మాటలు నమ్మిన యువకుడు రూ.12.50 లక్షలు పోగొట్టుకున్నాడు.
News April 10, 2026
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: అడ్లూరి

రైతు పండించిన పంటలకు మద్దతు ధరతో కొనుగోలు చేసి రైతులను ఆర్థికంగా అభివృద్ధి పరచడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం ధర్మపురి పట్టణ కేంద్రంల్లోని వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. రైతులు రబీ సీజన్లో పండించిన మొక్కజొన్న పంటకు మద్దతు ధర కల్పించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిదన్నారు.
News April 10, 2026
నల్గొండ: ఆ 1,483 స్కూల్స్ బాగుపడితే తిరుగుండదు

నల్గొండలోని కోమటిరెడ్డి ప్రతీక్ బొట్టుగూడ ZPHS.. ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. మంత్రి కోమటిరెడ్డి సొంతంగ రూ.8 కోట్లతో ఈ బడిని కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దడంతో, వచ్చే ఏడాది ప్రవేశాలకు అప్పుడే వేల సంఖ్యలో దరఖాస్తులు రావడంతో అడ్మిషన్లు క్లోజ్ చేశారు. అయితే, జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 1,483 ప్రభుత్వ పాఠశాలలను కూడా డెవలప్ చేస్తే పేరెంట్స్ ప్రైవేట్ వైపు వెళ్లరు కదా అనే చర్చ మొదలైంది.


