News February 4, 2025

జగిత్యాల: శిశు మరణాల రేటును తగ్గించాలి: కలెక్టర్

image

శిశు మరణాల రేటును తగ్గించుటకు కృషి చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో మంగళవారం చైల్డ్ డెత్ రివ్యూ పై వైద్యాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మరణాలు సంభవించకుండా తప్పించే మార్గాలను అన్వేషించాలని సూచించారు. ట్రాన్స్పోర్టేషన్ మెరుగుపరచాలని, వైద్యాధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. గృహ సందర్శన సమయంలో బాలింతలకు కౌన్సెలింగ్ చేయాలన్నారు. అధికారులు పాల్గొన్నారు.

Similar News

News July 11, 2025

రాజంపేట: యువకుల మిస్సింగ్‌పై పవన్‌కు ఫిర్యాదు

image

రాజంపేటకు చెందిన ముగ్గురు యువకులు థాయిలాండ్‌లో ఉద్యోగానికి వెళ్లి అదృశ్యమయ్యారు. వాళ్ల అచూకీ కనిపెట్టాలని రాజంపేటకు చెందిన పూజారి గిరిజా కుమారి అనే మహిళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌‌ను కోరారు. ఆయనకు యువకుల వివరాలు అందజేశారు. మహిళ ఫిర్యాదుతో డిప్యూటీ సీఎం కేంద్రంతో మాట్లాడారు. రాజంపేటలోని ఎస్వీ నగర్‌కు చెందిన ఓ యువకుడితో మరో ఇద్దరు 3నెలల కిందట థాయిలాండ్ వెళ్లగా వాళ్ల ఆచూకీ లభించలేదు.

News July 11, 2025

సారవకోట: ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆటో..ఒకరి మృతి

image

సారవకోట(M) కృష్ణాపురం సమీపంలో రహదారిపై గురువారం ఆగి ఉన్న లారీను వెనక నుంచి ఆటో బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌తో పాటు నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. అమ్మనమ్మ (56) మృతి చెందింది. మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

News July 11, 2025

SRPT: తాటి చెట్టుపై నుంచి పడి కార్మికుడి మృతి

image

నూతనకల్ మండలం మిర్యాలలో తాటిచెట్టు పైనుంచి జారిపడి <<17026525>>గీత కార్మికుడు<<>> గురువారం మృతి చెందాడు. గ్రామానికి చెందిన అనంతుల లింగయ్య (50) రోజు మాదిరిగా కల్లు గీసేందుకు తాటిచెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారి కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. లింగయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.