News February 5, 2025
జగిత్యాల: శ్వేత యాక్సిడెంట్ ఘటన.. అమ్మ కోసం 100 కిలోమీటర్లు!

చిల్వకోడూరు వద్ద నిన్న కారు, బైక్ను ఢీకొన్న ఘటనలో SIశ్వేతతోపాటు <<15356623>>బ్యాంకు ఉద్యోగి నరేశ్(28)<<>> చనిపోయిన విషయం తెలిసిందే. కాగా నరేశ్ది నిరుపేద కుటుంబం. అతడి అన్న ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లగా అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మకు తోడుగా నరేశ్ ఉండేందుకు నిత్యం సుమారు 100కిలోమీటర్లు బైక్పై ప్రయాణిస్తున్నారు.రోజులానే విధులకు వెళ్లిన కొడుకు విగతజీవిగా రావడంతో ఆ తల్లి బోరున విలపించడం స్థానికులను కంటతడి పెట్టించింది.
Similar News
News November 14, 2025
NRPT: నేటి బాలలే రేపటి పౌరులు: కలెక్టర్

నేటి బాలలే రేపటి పౌరులని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం నారాయణపేట పట్టణంలోని పళ్ళ వీధిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు ఆటలలో ముందుండాలని చెప్పారు. జవహర్ లాల్ నెహ్రూకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టమని చెప్పారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
News November 14, 2025
కల్వకుర్తి: బీసీ బాలుర వసతి గృహం సంఘటనపై విచారణ

కల్వకుర్తి పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ బాలుర వసతి గృహంలో దాదాపు 30 మంది విద్యార్థులను అకారణంగా అతిథి ఉపాధ్యాయుడు చితకబాదిన సంఘటనపై స్థానిక ఎంఆర్ఓ ఇబ్రహీం శుక్రవారం సాయంత్రం విచారణ చేపట్టారు. హాస్టల్ వద్దకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడి వివరాలు సేకరించారు. విచారణకు సంబంధించిన రిపోర్టు ఉన్నతాధికారులకు అందజేస్తానని ఆయన పేర్కొన్నారు.
News November 14, 2025
మహిళల భద్రతే పోలీసుల లక్ష్యం: ఎస్పీ జానకి

నిర్మల్ జిల్లాలో మహిళల భద్రతకు ఎల్లప్పుడూ తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. మహిళా రక్షణ కోసం షీ టీం బృందం నిరంతరం అప్రమత్తంగా ఉంటూ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుందని చెప్పారు. మహిళలపై వేధింపులు, అనుమానాస్పద వ్యక్తులు లేదా ఆకతాయిలను ఎక్కడైనా గమనించినా వెంటనే డయల్ 100కు లేదా షీ టీం పోలీసులకు 8712659550 నంబర్కు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు.


