News February 5, 2025
జగిత్యాల: శ్వేత యాక్సిడెంట్ ఘటన.. అమ్మ కోసం 100 కిలోమీటర్లు!

చిల్వకోడూరు వద్ద నిన్న కారు, బైక్ను ఢీకొన్న ఘటనలో SIశ్వేతతోపాటు <<15356623>>బ్యాంకు ఉద్యోగి నరేశ్(28)<<>> చనిపోయిన విషయం తెలిసిందే. కాగా నరేశ్ది నిరుపేద కుటుంబం. అతడి అన్న ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లగా అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మకు తోడుగా నరేశ్ ఉండేందుకు నిత్యం సుమారు 100కిలోమీటర్లు బైక్పై ప్రయాణిస్తున్నారు.రోజులానే విధులకు వెళ్లిన కొడుకు విగతజీవిగా రావడంతో ఆ తల్లి బోరున విలపించడం స్థానికులను కంటతడి పెట్టించింది.
Similar News
News November 13, 2025
GWL: అంగన్వాడీ కేంద్రాల్లో పెండింగ్ పనులు పూర్తి చేయాలి

జిల్లావ్యాప్తంగా పలు అంగన్వాడీ కేంద్రాల్లో పెండింగ్లో ఉన్న పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని గద్వాల కలెక్టర్ సంతోష్ సూచించారు. గురువారం ఐడీఓసీ మందిరంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఐసీడీఎస్, ఎన్ఆర్ఈజీఎస్, ఆర్థిక సంఘం నిధులతో ఆయా కేంద్రాల్లో మరుగుదొడ్లు, నీటి వసతి, విద్యుత్ తదితర పనులు ఎందుకు పూర్తి కాలేదన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించి డిసెంబర్ 15లోగా పూర్తి చేయాలన్నారు.
News November 13, 2025
GWL: నిరుద్యోగులకు జాబ్ మేళా- ప్రియాంక

గద్వాల జిల్లాలోని నిరుద్యోగ యువతకు వివిధ కంపెనీల్లో శిక్షణ ఉపాధి కల్పించేందుకు జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి డాక్టర్ ప్రియాంక గురువారం ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 14న ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 2:00 వరకు ఐడిఓసిలోని F-30/1 బ్లాక్లో నిర్వహిస్తామని తెలిపారు. SSC, ఇంటర్, డిగ్రీ చదివిన 18 నుంచి 35 సంవత్సరాలు వయసు గలవారు హాజరు కావాలన్నారు.
News November 13, 2025
జిల్లాలో వారిపై నిఘా ఉంచాలి: అనకాపల్లి ఎస్పీ

జిల్లాలో తరచూ నేరాలకు పాల్పడుతున్న నేరస్తులపై నిఘా ఉంచాలని ఎస్పీ తుహీన్ సిన్హా పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. గత నెలలో నమోదైన నేరాలు, కేసుల దర్యాప్తు, పురోగతి, పెండింగ్ వారెంట్లుపై ఆరా తీశారు. ట్రాఫిక్ సమస్యలపై చర్చించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్తో సమన్వయం కొనసాగిస్తూ కేసులలో శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలన్నారు.


