News February 5, 2025
జగిత్యాల: శ్వేత యాక్సిడెంట్ ఘటన.. అమ్మ కోసం 100 కిలోమీటర్లు!

చిల్వకోడూరు వద్ద నిన్న కారు, బైక్ను ఢీకొన్న ఘటనలో SIశ్వేతతోపాటు <<15356623>>బ్యాంకు ఉద్యోగి నరేశ్(28)<<>> చనిపోయిన విషయం తెలిసిందే. కాగా నరేశ్ది నిరుపేద కుటుంబం. అతడి అన్న ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లగా అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మకు తోడుగా నరేశ్ ఉండేందుకు నిత్యం సుమారు 100కిలోమీటర్లు బైక్పై ప్రయాణిస్తున్నారు.రోజులానే విధులకు వెళ్లిన కొడుకు విగతజీవిగా రావడంతో ఆ తల్లి బోరున విలపించడం స్థానికులను కంటతడి పెట్టించింది.
Similar News
News November 13, 2025
క్షేత్ర స్థాయి పరిశీలనలో వరంగల్ మున్సిపల్ కమిషనర్

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ నగరంలోని పలు డివిజన్లలో ఆకస్మికంగా పర్యటించి వసతులను పరిశీలించారు. 34వ డివిజన్ శివనగర్లో ఆమె పర్యటించి తాగునీటి సమస్య, డ్రైనేజీలు, పారిశుద్ధ్య కార్మికుల పనితీరును పరిశీలించారు. డివిజన్లలో మౌలిక వసతుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.
News November 13, 2025
ఉమ్మడి మెదక్ నుంచి టీ.టీకి ఎంపికైంది వీరే.!

ఉమ్మడి మెదక్ జిల్లా టీ.టీ అండర్ -14, 17 బాల, బాలికలు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. U/17 బాలురు.. జి.గౌతమ్ కుమార్, జి.భరద్వాజ్, కే. చరణ్, U/17 బాలికలు.. పి.నవ్యశ్రీ, పి.బృహతి, ఎస్.నందిని, U/14 బాలురు.. బి.ఆయుష్, కే.ప్రతీక్, ఎస్.నర్సింగరావు, U/14 బాలికలు.. టీ.మౌనిక, ఎన్.భానుప్రియ, పి.లాస్య ఉన్నారు. వీరు ఈనెలలో ఖమ్మంలో జరిగే రాష్ట్ర పోటీలలో పాల్గొంటారని ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి నాగరాజు తెలిపారు.
News November 13, 2025
వరంగల్: క్వింటా పత్తి ధర రూ.6,870

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో రెండు రోజులతో పోలిస్తే నేడు పత్తి ధర స్వల్పంగా పెరిగింది. మంగళవారం, బుధవారం రూ.6,830 పలికిన క్వింటా పత్తి ధర.. ఈరోజు రూ. 40 పెరిగి రూ.6,870 అయింది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ఉన్న డిమాండ్ను బట్టి పత్తి ధరల్లో తేడాలు ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు.


