News February 5, 2025

జగిత్యాల: శ్వేత యాక్సిడెంట్ ఘటన.. అమ్మ కోసం 100 కిలోమీటర్లు!

image

చిల్వకోడూరు వద్ద నిన్న కారు, బైక్‌ను ఢీకొన్న ఘటనలో SIశ్వేతతోపాటు <<15356623>>బ్యాంకు ఉద్యోగి నరేశ్(28)<<>> చనిపోయిన విషయం తెలిసిందే. కాగా నరేశ్‌ది నిరుపేద కుటుంబం. అతడి అన్న ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లగా అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మకు తోడుగా నరేశ్ ఉండేందుకు నిత్యం సుమారు 100కిలోమీటర్లు బైక్‌పై ప్రయాణిస్తున్నారు.రోజులానే విధులకు వెళ్లిన కొడుకు విగతజీవిగా రావడంతో ఆ తల్లి బోరున విలపించడం స్థానికులను కంటతడి పెట్టించింది.

Similar News

News December 5, 2025

తిరుమలలో ఇద్దరు అరెస్ట్

image

తిరుమల శ్రీవారి దర్శనం కల్పిస్తామని భక్తులను మోసం చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. సూళ్లూరుపేట, గూడూరు ఎమ్మెల్యేలు నెలవల విజయశ్రీ, సునీల్ కుమార్, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి పేరిట ఫేక్ లెటర్లు సృష్టించారు. వీటి ద్వారా హైదరాబాద్ భక్తులను దర్శనానికి పంపారు. పోలీసులు నిఘా పెట్టి ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిందితులు నాయుడుపేటకు చెందిన ప్రవీణ్ కుమార్, చెంచు బాలాజీగా గుర్తించారు.

News December 5, 2025

పీజీ సెట్ రాయకపోయినా అడ్మిషన్

image

AP: MA, M.Sc, M.Com కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది పీజీ సెట్‌ అర్హతను మినహాయించింది. పీజీ సెట్ అర్హత సాధించకపోయినా, సెట్ రాయకపోయినా స్పాట్ కోటా కింద అడ్మిషన్లు చేపట్టేందుకు అవకాశం కల్పించింది. వర్సిటీలు, కాలేజీల్లో మిగిలిన కన్వీనర్ కోటా సీట్లను ఈ స్పాట్ కోటా కింద ఫిల్ చేయాలని ఆదేశించింది. ఈ కోటాలో చేరే విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ వర్తించదు.

News December 5, 2025

KMR: జిల్లాలో 10 గ్రామ పంచాయతీల సర్పంచుల ఏకగ్రీవం

image

కామారెడ్డి జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఘట్టం రసవత్తరంగా మారింది. 10 మండలాల పరిధిలోని 167 పంచాయతీలు, 1520 వార్డులకు నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. బుధవారంతో ఉపసంహరణ గడువు ముగియగా..10 గ్రామ పంచాయతీల సర్పంచ్ లు ఏకగ్రీవమైనట్లు DPO మురళి గురువారం వెల్లడించారు. మిగిలిన స్థానాల్లో పోటీ అనివార్యమవడంతో, ఆయా గ్రామాల్లో అభ్యర్థులు ప్రచారానికి సిద్ధమయ్యారు.