News January 30, 2025
జగిత్యాల: సీనియర్ సిటిజన్ల పోస్ట్ కార్డు ఉద్యమం

తమ డిమాండ్ల పరిష్కారానికి జగిత్యాల జిల్లాలోని సీనియర్ సిటిజన్లు పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ప్రధాన పోస్ట్ ఆఫీస్ కార్యాలయానికి సైకిల్ లపై వెళ్లి ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రులకు పోస్ట్ కార్డులు వేశారు. ఈ కార్యక్రమంలో గౌరీశెట్టి విశ్వనాధం, యాకుబ్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 25, 2025
SKLM: మృత్యువుగా మారిన 3 చక్రాల బండి

మందస మండలం వీజీపురం గ్రామానికి చెందిన దివ్యాంగుడు సింహాచలం (43) మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. సింహాచలం 3 చక్రాల స్కూటీపై జాతీయరహదారిపై ప్రయాణిస్తున్నాడు. ప్రమాదవశాత్తు అది బోల్తా పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని 108లో హరిపురం సీహెచ్కు తరలించారు. పరిస్థితి విషమించి మృతి చెందాడు. మందస పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News November 25, 2025
నంద్యాల: కేసీ కెనాల్లో బాలుడి మృతదేహం

గోస్పాడు మండలం సాంబవరం గ్రామం వద్ద కేసీ కెనాల్లో పొన్నాపురానికి చెందిన ఖాజావలి అనే బాలుడి మృతదేహం లభ్యమయింది. ఖాజావలి సోమవారం మధ్యాహ్నం కేసీ కెనాల్ వద్ద ఆడుకుంటుండగా జారి కెనాల్లో పడ్డాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులు గాలించినా ఫలితం లేకుండా పోయింది. ఇవాళ సాంబవరం గ్రామం వద్ద ఖాజావలి మృతదేహం లభ్యమయింది. ఘటనపై గోస్పాడు పోలీసులు కేసు నమోదు చేశారు.
News November 25, 2025
మంచిర్యాల: ‘మగవారికి వ్యాసెక్టమీ సురక్షితం’

ఆరోగ్యకరమైన, సంతోషకరమైన కుటుంబం పురుషుల భాగస్వామ్యంతోనే నిజమవుతుందని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా.అనిత అన్నారు. మంచిర్యాల లో వేసక్టమి అవగాహన వాల్ పోస్టర్లను మంగళవారం విడుదల చేశారు. ఈ నెల 21నుంచి డిసెంబర్ 4వరకు అవగాహన, శస్త్ర చికిత్సలు నిర్వహిస్తామని వివరించారు. పురుషులకు కోత, కుట్టులేని వ్యాసెక్టమీ, ఎన్ఎస్వీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు సురక్షితమైనవన్నారు.


