News March 22, 2025
జగిత్యాల: హిందీ పరీక్షకు 8 మంది విద్యార్థులు గైర్హాజరు

పదోతరగతి రెండోరోజు హిందీ పేపర్ రెగ్యులర్కు 11,849 విద్యార్థులకు 11,841 విద్యార్థులు హాజరయ్యారు. 8 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. రెగ్యూలర్ విద్యార్థుల హాజరుశాతం 99.93% సప్లిమెంటరీ విద్యార్థులు 4 విద్యార్థులకు 3 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరి హాజరుశాతం 75% అని అధికారులు తెలిపారు.
Similar News
News March 28, 2025
ఏడాదిలో రూ.23,730 పెరిగిన గోల్డ్ ధర

దేశంలో బంగారం ధర ఆకాశమే హద్దుగా పెరిగిపోతోంది. గత ఏడాది ఏప్రిల్ 1న ఢిల్లీలో 10 గ్రాముల గోల్డ్ రేటు(24 క్యారెట్లు) రూ.68,420 ఉండగా, ఇవాళ రూ.92,150కి చేరింది. ఏడాదిలో ఏకంగా రూ.23,730 పెరిగింది. <<15912228>>హైదరాబాద్లోనూ<<>> స్వచ్ఛమైన పసిడి ధర రూ.90,980 పలుకుతోంది. అంతర్జాతీయ ట్రేడ్ వార్స్ కారణంగా వృద్ధికి ఆటంకం కలుగుతుందనే ఆందోళనలు బంగారానికి డిమాండ్ పెంచుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
News March 28, 2025
వేసవిలో నీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలి: కలెక్టర్

పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం సంబంధిత ఆర్డీవోలు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో కలెక్టర్ టీఎస్ చేతన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుత వేసవిలో ఆయా డివిజన్లో ఎక్కడా కూడా నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే నీటి సమస్యపై ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షించి పరిష్కరించాలన్నారు.
News March 28, 2025
పలు అంశాలపై సమీక్ష నిర్వహించిన మంత్రి కేవీఆర్

నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి శుక్రవారం సమీక్షించారు. వేసవి దృష్ట్యా విద్యుత్ సేవలు, సాగు నీరు, త్రాగు నీరు వంటి అంశాలపై మంత్రి అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.